ETV Bharat / bharat

కరోనాతో పతంజలి డెయిరీ​ సీఈఓ మృతి

author img

By

Published : May 24, 2021, 3:08 PM IST

కొవిడ్​ సంబంధిత సమస్యలతో పతంజలి డెయిరీ సంస్థ సీఈఓ సునీల్​ బన్సల్​ ఈ నెల 19న కన్నుమూశారు. ఇటీవల అల్లోపతి ఔషధాలపై యోగా గురు బాబా రాం​దేవ్​ వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో బన్సల్​ మృతి వెలుగులోకి రావటం గమనార్హం.

patanjali, baba ramdev
పతంజలి డైరీస్​ సీఈఓ

యోగా గురు బాబా రాం​దేవ్​కు చెందిన పతంజలి ఆయుర్వేద​ డైయిరీ సంస్థ​ల సీఈఓ సునీల్​ బన్సల్..​ కరోనా సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ మే 19న రాజస్థాన్​ జైపుర్​లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందారు. అల్లోపతి ఔషధాలపై బాబా రాం​దేవ్ ఇటీవల ​చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమైన క్రమంలో ఆయన మృతి వెలుగులోకి రావటం గమనార్హం.

కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన సునీల్​ బన్సల్​(57)కు ఊపిరితిత్తులు, మెదడు రక్తనాళాల్లో సమస్య ఏర్పడింది. దాంతో.. ఆయన చనిపోయారని జైపుర్​లోని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డెయిరీ రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన బన్సల్​.. 2018లో పతంజలి డెయిరీ బిజినెస్​ బాధ్యతలను చేపట్టారు. ఆయన సారథ్యంలో ఈ సంస్థ మంచి ఫలితాలు నమోదు చేసింది.

ఇదీ చూడండి: 'వైద్యశాస్త్రంపై రాం​దేవ్​కు దురుద్దేశమేమీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.