ETV Bharat / bharat

Central Vista: పిటిషన్ తిరస్కరణ- రూ.లక్ష జరిమానా

author img

By

Published : May 31, 2021, 11:23 AM IST

Updated : May 31, 2021, 11:41 AM IST

delhi highcourt
దిల్లీ హైకోర్టు

సెంట్రల్ విస్టా(Central Vista) ప్రాజెక్టును కొనసాగించవచ్చని దిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. నిర్మాణ పనులు నిలిపివేయాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిని అత్యవసర ప్రాజెక్ట్​గా ధర్మాసనం అభివర్ణించింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు(Central Vista) పనులను కొనసాగించవచ్చని దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని అత్యవసర ప్రాజెక్ట్​గా హైకోర్టు అభివర్ణించింది. కొత్త పార్లమెంట్​ నిర్మాణ పనులు నిలిపివేయాలన్న పిటిషన్‌ను జస్టిస్​ డీఎన్ పాటిల్​, జస్టిస్ జ్యోతి సింగ్​లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. పిటిషన్‌లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని వివరిస్తూ.. పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది.

దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం చేపట్టిన (కొత్త పార్లమెంట్​)సెంట్రల్ విస్టా ప్రాజెక్టు(Central Vista) నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇదీ చదవండి : 'సోలీ సొరాబ్జీ సేవలు మకుటాయమానం'

Last Updated :May 31, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.