ETV Bharat / bharat

కీలక ప్రతిపాదనలకు కేబినెట్​ పచ్చజెండా

author img

By

Published : Apr 20, 2021, 4:41 PM IST

Updated : Apr 20, 2021, 9:32 PM IST

Piyush Goyal
పీయూష్ గోయల్

బెంగళూరులో మెట్రో రైల్​ 2ఏ, 2బీ దశల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఒడిశాలోని తాల్చేర్​ ఎరువుల కర్మాగారంలో బొగ్గును గ్యాస్​గా మార్చి యూరియాను ఉత్పత్తి చేసే ప్రత్యేక సబ్సిడీ విధానాన్ని అమలు చేయనుంది. వీటితో పాటు మరిన్ని బిల్లులకూ కేబినెట్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

కర్ణాటక బెంగళూరులో మెట్రో రైల్​ ప్రాజెక్టు 2ఏ, 2బీ దశల నిర్మాణానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ తెలిపారు. 58.19 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గాలకు రూ.14,788.101 కోట్లు వ్యయం కానుంది.

తాల్చేర్​ ఎరువుల కర్మాగారానికి గ్రీన్​ సిగ్నల్​

ఒడిశాలోని తాల్చేర్‌ ఎరువుల కర్మాగారంలో బొగ్గును గ్యాస్‌గా మార్చి తయారు చేసే యూరియాకు.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ. 13,277 కోట్లు అంచనా వ్యయంతో ఈ సబ్సిడీ విధానాన్ని అమలు చేయనున్నారు.

ఫలితంగా.. ఏటా 12.70 లక్షల టన్నుల యూరియా దిగుమతిని తగ్గించడానికి కేంద్రం నిర్ణయం దోహదం చేయనుంది.

ఆర్థిక బిల్లు సవరణలకూ పచ్చజెండా..

2021-22 ఏడాదికి సంబంధించిన ఆర్థిక బిల్లు సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ సవరణలతో.. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సకాలంలో ఆదాయాన్ని తీసుకురావడం సహా పన్ను చెల్లింపుదారులు, ఇతర వాటాదారుల సమస్యల్ని పరిష్కరించుకునేందుకు మార్గం సుగమం కానుంది.

ఈ బిల్లు మార్చి 28న.. రాష్ట్రపతి ఆమోదం పొందిన అనంతరం.. 2021 ఆర్థిక చట్టంగా మారింది.

ఇదీ చదవండి: భారత్‌లో వ్యాక్సిన్​లకు అమెరికా అడ్డుపుల్ల.!

ఐసీఏఐ, సీఏఏఎన్​జడ్​ ఒప్పందానికి ఆమోదం..

ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ చార్టర్డ్​ అకౌంటెంట్స్​ ఆఫ్​ ఇండియా(ఐసీఏఐ), చార్టర్డ్​ అకౌంటెంట్స్​ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​(సీఏఏఎన్​జడ్​) మధ్య అవగాహనా ఒప్పందానికి సంబంధించిన కొత్త మెమోరండమ్​పై సంతకం చేసేందుకూ కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం వల్ల దేశీయ చార్టర్డ్​ అకౌంటెంట్లకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దేశానికి అధిక చెల్లింపులు జరుగుతాయని మంత్రివర్గం పేర్కొంది.

దీంతో పాటు ఐసీఏఐ, సర్టిఫైడ్​ ప్రాక్టీసింగ్​ అకౌంటెంట్​ ఆస్ట్రేలియా(సీపీఏఏ)ల మధ్య పరస్పర గుర్తింపు ఒప్పందంపైనా సంతకం చేసేందుకూ మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్టు తెలిపింది.

సీసీఐకూ ఓకే..

కాంపిటీషన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా(సీసీఐ), బ్రెజిల్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఫర్ ఎకనమిక్ డిఫెన్స్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్​ మంగళవారం ఆమోదించింది.

సీసీఐ చట్టంలో భాగంగా ఈ సంస్థ.. ఇప్పటివరకు ఆరు ఒప్పందాలు(యూఎస్​ ఫెడరల్​ ట్రేడ్​ కమిషన్, డిపార్ట్​మెంట్​ ఆఫ్​ జస్టిస్​; యూరోపియన్​ యూనియన్​ డైరెక్టర్​ జనరల్​ కాంపిటీషన్​; రష్యన్​ ఫెడరల్​ యాంటీమోనోపోలీ సర్వీస్​; ఆస్ట్రేలియన్​ కాంపిటీషన్​, వినియోగదారుల కమిషన్​; కెనడా కాంపిటీషన్​ కాంపిటీషన్​ బ్యూరో; బ్రిక్స్​ కాంపిటీషన్​ అథారిటీస్​) కుదుర్చుకుంది.

ఇదీ చదవండి: స్పుత్నిక్​-వి 10 రోజుల్లో భారత్​లోకి!

భారత్​, బంగ్లా వాణిజ్య సమస్యా పరిష్కారం దిశగా..

వాణిజ్య సమస్యల పరిష్కార సహకారాన్ని పెంచేలా.. ఇండియా డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ ట్రేడ్​ రెమిడీస్​, బంగ్లాదేశ్​ ట్రేడ్​ అండ్​ టారిఫ్​ కమిషన్ మధ్య అవగాహన ఒప్పందానికి కేబినెట్​ పచ్చజెండా ఊపినట్టు కేంద్రం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల మధ్య గత నెల 27న.. ఢాకాలో ఈ ఒప్పందం కుదిరింది.

వాణిజ్య సమస్యల పరిష్కారం, సమాచార బదిలీ, వసతుల నిర్మాణ కార్యకలాపాల్లో ఇరుదేశాల సహకారాన్ని ప్రోత్సహించడమే ఈ ఒప్పంద ప్రాథమిక లక్ష్యం.

ఇదీ చదవండి: భారత్‌లో వ్యాక్సిన్​లకు అమెరికా అడ్డుపుల్ల.!

Last Updated :Apr 20, 2021, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.