ETV Bharat / bharat

విద్యార్థులను ఎక్కించుకోలేదని మంత్రి బస్ ఛేజింగ్

author img

By

Published : Jan 9, 2021, 8:26 PM IST

పాఠశాల విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్లిన బస్సు డ్రైవర్, కండక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక విద్యాశాఖ మంత్రి. బస్సును వెంబడించి అడ్డుకున్నారు. పిల్లల్ని తప్పనిసరిగా ఎక్కించుకోవాలని ఆదేశించారు.

Minister Suresh Kumar Stops the Bus by chasing
విద్యార్థులను ఎక్కించుకోలేదని మంత్రి బస్ ఛేజింగ్

పాఠశాల విద్యార్థులను చూసి బస్సు ఆపలేదని కర్ణాటక ప్రాథమిక-ఉన్నత విద్యా శాఖ మంత్రి కే సురేష్ కుమార్.. అదే ఆర్​టీసీ బస్సును వెంబడించి ఆపేశారు.

తుమకూరు జిల్లాలోని మధుగిరిని సందర్శించేందుకు వెళ్తున్న ఆయన.. రోడ్డు పక్కన పిల్లలు ఆగి ఉండటాన్ని గమనించారు. బస్సు ఆపాలని పిల్లలు చేయి చూపించి అడిగినా.. ఆగకుండా వెళ్లిపోవడాన్ని చూశారు. దీంతో బస్సును తన కాన్వాయ్​తో వెంబడించి అడ్డగించారు. డ్రైవర్, కండక్టర్​కు వార్నింగ్ ఇచ్చారు. పాఠశాల విద్యార్థులను తప్పనిసరిగా ఎక్కించుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: వూలా ఛాయ్​... జర దేఖో భాయ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.