ETV Bharat / bharat

8 రోజుల్లోనే వంతెన పునర్నిర్మించి బీఆర్​ఓ రికార్డ్​

author img

By

Published : Apr 20, 2021, 5:44 AM IST

కేవలం 8 రోజుల వ్యవధిలోనే 110 అడుగుల పొడవైన వంతెనను పునరుద్ధరించి సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ రికార్డు సృష్టించింది. శీతాకాలంలో కురిసిన భారీ మంచుతో వంతెన క్షీణించగా.. పునర్నిర్మించింది.

bro
8 రోజుల్లో 110 అడుగుల వంతెన పునర్నిర్మాణం

సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ(బీఆర్​ఓ) మరో రికార్డు సృష్టించింది. 8 రోజుల్లోనే.. లేహ్​-సార్చు రహదారిపై ఉన్న 110 అడుగుల పొడవైన వంతెనను పునరుద్ధరించింది. మనాలీ ప్రాంతాన్ని కలిపే ఈ రహదారిపై ఆర్మీకి చెందిన వాహనాలు, కాన్వాయ్​లు రాకపోకలు సాగిస్తుంటాయి.

క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య..

విస్కీ నల్లాహ్​ ప్రాంతంలో ఉన్న ఈ బెయిలీ వంతెన.. శీతాకాలంలో కురిసిన భారీ మంచుతో పూర్తిగా క్షీణించిపోయింది. ఈ క్రమంలో ఈ వంతెనకు ఉన్న ప్రాముఖ్యతను గ్రహించిన బీఆర్​ఓ రంగంలోకి దిగింది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఏప్రిల్​ 5 నుంచి 12 మధ్య ఈ వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టి.. విజయవంతంగా పూర్తి చేసింది.

వేసవి కాలంలో లద్దాఖ్​లోని ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ వంతెనను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. వంతెనలోని కలప స్థానంలో ఉక్కును ఉపయోగించి పునర్నిర్మించినట్లు చెప్పారు. బీఆర్​ఓ కృషి పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో​ ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.