ETV Bharat / bharat

భాజపాకు భారీగా విరాళాలు.. కాంగ్రెస్​కు అంతంతే!

author img

By

Published : Jun 10, 2021, 8:57 PM IST

2019-20 మధ్య భాజపాకు భారీగా విరాళాలు అందాయి. ఈ కాలంలో కమలం పార్టీకి రూ.785 కోట్లు వచ్చాయి. ఇదే సమయంలో కాంగ్రెస్​కు రూ.139 కోట్లు విరాళంగా అందాయి.

bjp party donations, పార్టీ విరాళాలు
భారీగా భాజపాకు విరాళాలు.. కాంగ్రెస్​కు అంతంత మాత్రమే!

2019-20 మధ్య రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా భాజపాకు రూ.785 కోట్లు అందాయి. ఈ మొత్తం కాంగ్రెస్​కు అందిన విరాళాల కన్నా ఐదు రెట్లు ఎక్కువ. కాంగ్రెస్​ పార్టీకి రూ.139 కోట్లు రాగా.. తృణమూల్​ కాంగ్రెస్​కు రూ.8 కోట్లు, సీపీఐకి రూ.1.3 కోట్లు, సీపీఐ(ఎం)కు రూ.19.7 కోట్లు విరాళాలు వచ్చాయి. ఇటీవల ఈ పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన నివేదికలో ఈ వివరాలను పేర్కొన్నాయి.

భాజపాకు అందిన విరాళాల్లో అత్యధికంగా ఎలక్టోరల్​ ట్రస్ట్​లు, కార్పొరేట్ సంస్థలు, పార్టీ నేతల నుంచి ఉన్నాయి. నేతల్లో పీయూష్​ గోయల్​, పెమా ఖండు, కిరణ్​ ఖేర్​, రమణ్ సింగ్​లు ఎక్కువ విరాళాలు ఇచ్చారు.

కార్పొరేట్​ సంస్థల్లో ఐటీసీ, కల్యాణ్​ జువెలర్స్, రేర్​ ఎంటర్​ప్రైజస్​, అంబుజా సిమెంట్​ వంటి సంస్థలు భాజపాకు విరాళాలు ఇచ్చిన జాబితాలో ఉన్నాయి.

రూ.20 వేలు మించిన విరాళాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా పార్టీలు వార్షిక ఆడిట్ రిపోర్ట్​లను సమర్పించేందుకు జూన్​ 30 వరకు గడువు పొడిగించింది. ​

ఇదీ చదవండి : మొన్న సింధియా.. నిన్న ప్రసాద.. తర్వాత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.