ETV Bharat / bharat

నిబంధనలు ఉల్లంఘించారని సీఎంపై ఫిర్యాదు..!

author img

By

Published : Sep 16, 2021, 7:33 PM IST

Updated : Sep 16, 2021, 8:21 PM IST

కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించారని బంగాల్​ ముఖ్యమంత్రిపై (Bhabanipur election) ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేసింది భాజపా.

Mamata Banerjee
మమతా బెనర్జీ

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (Mamata Banerjee).. ఎన్నికల కమిషన్​కు(ఈసీ) ఫిర్యాదు చేసింది రాష్ట్ర భాజపా. భవానీపుర్​​ ఉప ఎన్నిక (Bhabanipur election) ప్రచారంలో ఈసీ విధించిన కొవిడ్​ నిబంధనలను సీఎం ఉల్లంఘించారని ఆరోపించింది.

బుధవారం భారీ సంఖ్యలో తమ అనుచరులతో కలిసి.. భవానీపుర్​లోని (Bhabanipur election) ఓ గురుద్వారాను సందర్శించారు మమతా బెనర్జీ. అయితే ఈ సందర్శనలోనే ఆమె కొవిడ్ నిబంధనలు పాటించలేదని అన్నారు భాజపా చీఫ్​ ఎలక్షన్​ ఏజెంట్​ సజ్జల్​ గోష్.

ఈ నెల 30 జరగనున్న భవానీపుర్​ ఉప ఎన్నికలో తృణమూల్​ కాంగ్రెస్​ నుంచి సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్నారు. మమతకు పోటీగా ప్రియాంక తిబ్రీవాల్​ భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

ఈసీకి చేసిన ఫిర్యాదుపై తృణమూల్​ కాంగ్రెస్​ స్పందించింది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని.. పూర్తిగా రాజకీయ లబ్ధికోసం చేస్తున్న ప్రచారమని బదులిచ్చింది.

ఇదీ చదవండి: Priyanka gandhi up election: ప్రియాంక పోటీ చేస్తే.. ఎక్కడి నుంచి?

Last Updated :Sep 16, 2021, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.