భార్యకు నిప్పంటించిన భర్త.. ఏడేళ్ల బాలికపై మైనర్లు అత్యాచారం

author img

By

Published : Jul 7, 2022, 8:27 PM IST

Updated : Jul 7, 2022, 8:56 PM IST

Bhopal woman set ablaze by her husband  woman set on fire by husband  woman set on fire by husband in Bhopal  rape victim news  husband set wife on fire  man set on fire by wife

మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో భార్యపై పెట్రోల్​ పోసి నిప్పంటిచాడో భర్త. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో ఏడేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్​లోని నాగౌర్​లో జరిగింది.

భార్యపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన ఘటన మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. 9 శాతం శరీరం కాలిపోయిందని.. చికిత్స కొనసాగుతోందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రాజస్థాన్​కు చెందిన ముస్కాన్​, రాయిస్ ఖాన్ భార్యభర్తలు. వీరికి మూడేళ్ల కింద వివాహం కాగా.. అక్కడ నుంచి భోపాల్​కు వలస వచ్చారు. అయితే, పెళ్లైన ఏడాది నుంచి భార్యను కట్నం కోసం వేధిస్తున్నాడు రాయిస్ ఖాన్​. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకుంది. ఎనిమిది నెలల కింద వెళ్లిపోయి.. నగరం​లోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వృద్ధాశ్రమం సమీపంలో ఆమెను అడ్డగించిన భర్త.. తనతో రాజస్థాన్​కు రావాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన రాయిస్​.. భార్యపై పెట్రోల్​ పోసి నిప్పటించి పరారయ్యాడు.

ఏడేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ల అత్యాచారం: రాజస్థాన్​ నాగౌర్​లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు మైనర్లు​. బాలికను డాబా మీదకు తీసుకెళ్లిన నిందితులు.. ఈ అఘాయిత్యం చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

మెఢ్​తా రోడ్డు పోలీస్​ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని బాలికను ఇద్దరు మైనర్లు బావి వద్దకు తీసుకెళ్లి వేధించారు. అనంతరం డాబా పైకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ విషయం బయటచెబితే.. చంపేస్తామని బెదిరించారు. వారి బెదిరింపులకు భయపడిన బాలిక.. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. 5 రోజులు గడిచిన తర్వాత కడుపు నొప్పి అని చెప్పడం వల్ల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం వైద్య పరీక్షల్లో ఈ విషయం బయటపడింది.

బాలికను కత్తితో పొడిచిన దుండగుడు: దిల్లీలో దారుణ ఘటన జరిగింది. బాలికను కత్తితో పొడిచాడు ఓ దుర్మార్గుడు. తిలక్​నగర్ ప్రాంతానికి చెందిన బాలిక పాఠశాలకు వెళ్తుండగా దాడి చేశాడు. ఆమె ఛాతీ, కడుపులో పోడిచినట్లు పోలీసులు తెలిపారు. బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బాధితురాలి ఇంటికి సమీపంలోని వ్యక్తే అని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా నిందితుడు తన బిడ్డను వేధిస్తున్నాడని.. దీనిపై గత నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితురాలి తల్లి చెప్పింది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: స్టూడెంట్​ను కిడ్నాప్ చేసిన టీచర్​.. డబ్బులు ఇవ్వలేదని బాత్రూమ్​లో పడేసి..

Last Updated :Jul 7, 2022, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.