ETV Bharat / bharat

'ఇలాంటి చర్యలతో మంచి పాలన అందిస్తారా?'

author img

By

Published : Nov 17, 2020, 3:52 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు.. ఎన్​డీఏ ప్రభుత్వం ఓ మహిళ సజీవ దహనానికి గురైన ఘటనను దాచిపెట్టిందని ఆరోపించారు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ. ఇలాంటి చర్యలతో మంచిపాలనను అందిస్తారా అని ధ్వజమెత్తారు.

'Woman burnt alive in Bihar': Rahul accuses Nitish govt of 'hiding' incident for electoral gains
'ఇలాంటి చర్యలతో మంచి పాలన అందిస్తారా?'

బిహార్​లోని ఎన్​డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజీవ దహనానికి గురైన ఓ మహిళ మరణ వార్తను ఎన్నికల ప్రయోజనం కోసం ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో మంచిపాలన అందిస్తారా అని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు ఓ కథనాన్ని జత చేశారు.

  • किसका अपराध ज़्यादा ख़तरनाक है-

    जिसने ये अमानवीय कर्म किया?

    या

    जिसने चुनावी फ़ायदे के लिए इसे छुपाया ताकि इस कुशासन पर अपने झूठे 'सुशासन' की नींव रख सके? pic.twitter.com/VDIeL19F3Q

    — Rahul Gandhi (@RahulGandhi) November 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" ఎవరు ఈ అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. ఎన్నికల్లో లాభం కోసం ఎవరు తప్పులను కప్పిపెట్టారు. ఇలాంటి చర్యలతో మంచిపాలనకు పునాది వేస్తారా?"

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

వైశాలి జిల్లాలోని మహిళను ఓ యువకుడు అతని స్నేహితులు.. సజీవ దహనం చేశారు. ఆ మహిళ.. ఆసుపత్రిలో 15రోజుల పాటు పోరాడి.. ప్రాణాలు కోల్పోయింది.

ఇదీ చూడండి:'అప్పుడు రాహుల్‌ గాంధీ పిక్నిక్‌కు వెళ్లారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.