ETV Bharat / bharat

చైనా యాప్స్​​పై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Jul 2, 2020, 7:18 PM IST

చర్చల్లో కుదిరిన అంగీకారానికి కట్టుబడి.. సరిహద్దులో శాంతి నెలకొల్పడానికి చైనా సత్వరమే చర్యలు చేపట్టాలని భారత్​ స్పష్టం చేసింది. తమ దేశంలో కార్యకలాపాలు సాగించాలనుకునే వారు.. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. చైనా యాప్స్​ నిషేధం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

We expect the Chinese side to sincerely follow up and ensure expeditious restoration of peace in border: MEA
'సరిహద్దులో శాంతి స్థాపనకు చైనా సత్వరమే కృషి చేయాలి'

సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు చైనా సత్వరమే చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సైనిక స్థాయిలో జరిగిన చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. సమావేశంలో.. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్టు అంగీకరించాయని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ గుర్తు చేశారు. ఇప్పుడు చైనా తన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.

గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటన అనంతరం భారత్​-చైనా శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటివరకు సైనిక, దౌత్య స్థాయిలో పలుమార్లు సమావేశమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణతో పాటు సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి.

చైనా యాప్స్​ నిషేధాన్ని కూడా ప్రస్తావించారు శ్రీవాస్తవ. భారత్​లో కార్యకలాపాలు సాగించాలంటే.. సంబంధిత మంత్రిత్వశాఖ విధించే నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు.

'ఆ దాడితో సంబంధం లేదు...'

కరాచీ స్టాక్​ ఎక్స్చేంజీపై జరిగిన ఉగ్రదాడికి భారత్​ కారణమన్న పాకిస్థాన్​ ఆరోపణలను ఖండించారు శ్రీవాస్తవ. పాక్​.. తమ దేశంలో సమస్యలు పెట్టుకుని భారత్​ను నిందించడం సరికాదన్నారు. భారత్​పై ఆరోపణలు చేసే పాకిస్థానీలు.. ముందు తమ ప్రభుత్వం వైఖరిని పరిశీలించాలని.. ముఖ్యంగా ఓ అంతర్జాతీయ ఉగ్రవాదిని అమర వీరుడిగా అభివర్ణించిన తమ ప్రధాని వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

ఇదీ చూడండి- బాయ్​కాట్​ చైనా: డ్రాగన్​తో ఆ కంపెనీ బంధం కట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.