ETV Bharat / bharat

లాక్​డౌన్​ భయంతో ఖాళీ అవుతున్న రాజధాని!

author img

By

Published : Jul 13, 2020, 3:57 PM IST

బెంగళూరులో కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రభుత్వం మరో లాక్​డౌన్ విధిస్తుందన్న భయంతో వేలాదిమంది సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో తుమకూరు రోడ్​ సహా... నగర సరిహద్దు రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. బస్సులు ప్రయాణికులతో నిండిపోతున్నాయి.
Thousands of People were leaving Bengaluru in fear of Lockdown
లాక్​డౌన్​ భయంతో ఖాలీ అవుతున్న రాజదాని!

కర్ణాటక బెంగళూరులో వలస కార్మికులు, ఉద్యోగులు సొంతూళ్ల బాటపట్టారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ మరో లాక్​డౌన్​ విధించే అవకాశముందని వారంతా ఆందోళన చెందుతున్నారు.

లాక్​డౌన్​ భయంతో ఖాళీ అవుతున్న రాజధాని!

ఒకే రోజు 2,798 కరోనా కేసులు నమోదయిన తర్వాత బెంగళూరులో వారం రోజుల పాటు లాక్​డౌన్​ ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జులై 14 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ లాక్​డౌన్​ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలవుతోంది.

రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న తరుణంలో.. ప్రభుత్వం మరో లాక్​డౌన్ విధిస్తే పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందనుకున్న వేలాదిమంది వలస కార్మికులు, ఉద్యోగులు గ్రామాలబాట పట్టారు. కర్ణాటక ఆర్​టీసీలో సోమవారం 231 బస్సులు ముందుగానే ఆన్​లైన్​ బుకింగ్​తో నిండిపోయాయి.​ బస్​స్టాపుల్లో జనం కిక్కిరిసిపోయారు.

కేవలం జులై 13 ఉదయం 11 గంటల వరకు బెంగళూరు నుంచి 333 బస్సులు నడిపింది కేఎస్​ఆర్​టీసీ. ఈ బస్సుల్లో 8,938 మంది ప్రయాణికులు స్వగ్రామాలకు బయల్దేరారు. థర్మల్​ స్క్రీనింగ్ నిర్వహించి ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతిస్తున్నారు ఆర్​టీసీ సిబ్బంది.

ఇదీ చదవండి: '15 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.