ETV Bharat / bharat

నేడు 16వ ప్రవాస భారతీయ దివస్​​

author img

By

Published : Jan 9, 2021, 5:08 AM IST

Updated : Jan 9, 2021, 6:53 AM IST

16వ ప్రవాస భారతీయ దినోత్సవ సదస్సును నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిచనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఆన్​లైన్​ విధానంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

Pravasi Bharatiya Divas convention
16వ ప్రవాస భారతీయ దినోత్సవ సదస్సు

ప్రతిఏటా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రవాస భారతీయ దినోత్సవ 16వ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఆన్​లైన్​ విధానంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సురినామ్​ అధ్యక్షుడు చంద్రికా పెర్సాద్​ సంతోఖీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ తెలిపారు.

'ఆత్మనిర్భర్​ భారత్​లో భాగస్వామ్యం' అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు ప్లీనరీలుగా నిర్వహించే ఈ సదస్సు చివరిలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగిస్తారు. ఈ సదస్సు సందర్భంగా 2020-21 సంవత్సరానికి గాను ప్రవాస భారతీయ సమ్మాన్​ అవార్డు విజేతల పేర్లను ప్రకటించనున్నారు.

ఇదీ చూడండి: 'టీకా పంపిణీతో మానవాళికి ప్రయోజనం కలగాలి'

Last Updated :Jan 9, 2021, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.