ETV Bharat / bharat

ఎస్పీజీని గత ప్రభుత్వాలు నీరుగార్చాయి: షా

author img

By

Published : Nov 27, 2019, 4:24 PM IST

Updated : Nov 27, 2019, 8:04 PM IST

ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీజీ) ముఖ్య ఉద్దేశాన్ని పునరుద్ధరించేందుకే చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చామని స్పష్టంచేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. గత ప్రభుత్వాలు ఎస్పీజీని నీరుగార్చాయని ఆరోపించారు. మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు వారి జీవితాంతం ఎస్పీజీ రక్షణ కల్పించాలని లోక్​సభలో చర్చ సందర్భంగా డిమాండ్​ చేసింది కాంగ్రెస్​.

SPG bill
ఎస్పీజీనీ గత ప్రభుత్వాలు నీరుగార్చాయి: షా

ఎస్పీజీని గత ప్రభుత్వాలు నీరుగార్చాయి: షా

ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీజీ) చట్టాన్ని గత ప్రభుత్వాలు నీరుగార్చాయని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. చట్టంలోని ముఖ్య ఉద్దేశాన్ని పునరుద్ధరించేందుకే మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎస్పీజీ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చిందని ఉద్ఘాటించారు.

ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై లోక్​సభలో చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్​ షా. దేశాధినేతల కోసం ఉద్దేశించిన చట్టాన్ని సవరించి... మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ కుటుంబ సభ్యులు సోనియా, రాహుల్​, ప్రియాంక గాంధీని ఎస్పీజీ పరిధిలోకి తీసుకొచ్చారని ఆరోపించారు.

" ప్రధానమంత్రి రక్షణపై కార్యాచరణ ప్రణాళిక కోసం 1985లో బీర్బల్​నాథ్​ కమిటీ ఏర్పాటు చేశారు. 1988లో ఒక చట్టం తెచ్చారు. ఈ చట్టానికి లోబడి ప్రధాని, ఆయన కుటుంబ రక్షణ కోసం ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీజీ) పనిచేస్తోంది. ఈ చట్టాన్ని 1991, 94లో సవరించారు. 1999, 2003లోనూ సవరణలు చేశారు. ఇవి చట్టాన్ని నీరుగార్చాయి. చట్టంలోని ముఖ్య ఉద్దేశాన్ని పునరుద్ధరించేందుకు ఇప్పుడు మేము మరోమారు సవరణతో వచ్చాం."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

జీవితాంతం ఎస్పీజీ రక్షణ కల్పించాలి: కాంగ్రెస్​

మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు జీవితాంతం ఎస్పీజీ రక్షణ కల్పించాలని లోక్​సభలో డిమాండ్​ చేసింది కాంగ్రెస్​. గాంధీలకు ఎస్పీజీ భద్రత తొలగించటానికి కారణాలు చెప్పాలని కోరారు కాంగ్రెస్​ సభ్యుడు మనీష్​ తివారీ. అమెరికా వంటి దేశాల్లో సీక్రెట్​ సర్వీసెస్​ గార్డ్స్​ మాజీ ప్రధానులకు జీవితాంతం రక్షణగా నిలుస్తున్నట్లు గుర్తు చేశారు.

మాజీ ప్రధానులకు ఐదేళ్ల పాటు..

ప్రస్తుత చట్ట సవరణ ప్రకారం.. ప్రధానమంత్రి, ఆయనతో పాటు ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ రక్షణ లభిస్తుంది. మాజీ ప్రధానులు వారికి కేటాయించిన ఇళ్లల్లో ఉండే కుటుంబ సభ్యులకు ఐదేళ్లపాటు ప్రత్యేక భద్రత ఉంటుంది.

ఇదీ చూడండి: 'గాంధీ'ల కోసం వచ్చేవారం లోక్​సభలో 'ప్రత్యేక' బిల్లు

AP Video Delivery Log - 0500 GMT News
Wednesday, 27 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0416: US Pompeo HKong China AP Clients Only 4241984
Pompeo on HKong elex, China's treatment of Uighurs
AP-APTN-0322: South Korea Mekong Summit AP Clients Only 4241985
First South Korea-Mekong Summit held in Busan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 27, 2019, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.