ETV Bharat / bharat

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

author img

By

Published : Nov 2, 2020, 7:25 AM IST

యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో 10 మందికి గాయాలయ్యాయి. భక్తులు కిఛోరా షరీఫ్ దర్గాను సందర్శించి తిరిగివస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

accident-in-uttar pradesh prayagpur bahraich
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​పుర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివదహా ప్రాంతంలో రెండు వాహనాలు ఢీకొని ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

భక్తులతో వెళ్తున్న ట్రక్కు... మరో వాహనాన్ని ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరంతా కిఛోరా షరిఫ్ దర్గాను సందర్శించి తిరిగివస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళ ఒకటిన్నర, రెండు గంటల మధ్య ప్రమాదం జరిగినట్లు జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగానికి చెందిన డాక్టర్ వివేక్ గుప్తా తెలిపారు. ఐదుగురు ఘటనాస్థలిలోనే మరణించారని, ఆస్పత్రికి తీసుకొచ్చిన 11 మందిలో ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.