ETV Bharat / bharat

'గాంధీ కుటుంబీకులకు భద్రత తొలగించలేదు.. మార్చాం'

author img

By

Published : Nov 27, 2019, 6:40 PM IST

గాంధీ కుటుంబీకులకు పూర్తిస్థాయిలో భద్రత తొలగించలేదని.. ఎస్పీజీ నుంచి జడ్​ప్లస్​కు మార్చామని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. భాజపా ఎన్నడూ ప్రతీకార విధానంలో నిర్ణయాలు తీసుకోదని తెలిపారు. గాంధీ కుటుంబానికి భద్రత ఉపసంహరించేందుకే భాజపా చట్ట సవరణ తెచ్చిందనే రీతిలో ప్రచారం చేశారని కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడి చేశారు.

Shah
'గాంధీ కుటుంబీకులకు భద్రత తొలగించలేదు.. మార్చాం'

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా, రాహుల్​, ప్రియాంక గాంధీలకు భద్రత తొలగించలేదని.. ఎస్పీజీ నుంచి అంబులెన్స్​తో కూడిన జడ్​ ప్లస్​కు మార్పు చేశామని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.

ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) చట్టం-1988 సవరణ బిల్లుపై లోక్​సభలో చర్చ సందర్భంగా వివరణ ఇచ్చారు షా. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. ప్రతీకార విధానంలో భాజపా ఎన్నడూ నిర్ణయాలు చేపట్టదని.. ఇలాంటివి కాంగ్రెస్​ మాత్రమే చేస్తుందని ఆరోపించారు. హస్తం పార్టీ గతంలో చాలాసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని ఎదురుదాడి చేశారు.

" గాంధీ కుటుంబానికి భద్రత ఉపసంహరించేందేకే ఎస్పీజీ చట్ట సవరణ తీసుకొచ్చారనేలా ప్రచారం కల్పించారు. గాంధీ కుటుంబానికి రక్షణ ఉపసంహరించలేదు.. దానిని ఆధునిక భద్రతా అనుసంధానంతో, అంబులెన్స్​ కలిగిన జడ్​ ప్లస్​గా మార్చాం. ఇది దేశవ్యాప్తంగా రక్షణ ఇస్తుంది. "

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

మాజీ ప్రధానులు చంద్ర శేఖర్​, ఐకే గుజ్రాల్​, మన్మోహన్​ సింగ్​లకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించినప్పడు ఎవరూ.. ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు షా.

ఇదీ చూడండి: ఎస్పీజీని గత ప్రభుత్వాలు నీరుగార్చాయి: షా

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.