ETV Bharat / bharat

షాహిన్​బాగ్:​ 'నిరసనలతో ఆటంకం కలిగించొద్దు'

author img

By

Published : Feb 19, 2020, 4:26 PM IST

Updated : Mar 1, 2020, 8:38 PM IST

దిల్లీలోని షాహిన్‌ బాగ్‌లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారితో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు ఇద్దరు మధ్యవర్తులను ఏర్పాటు చేసింది. రాకపోకలకు అంతరాయం కలగకుండా మరో చోట నిరసన చేపట్టేలా చూడాలని వారికి తెలిపింది.

SC-appointed mediators reach Shaheen Bagh to hold talks with protesters
షాహిబాగ్​ నిరసనలు మరోచోట చేపట్టేలా చూడండి: సుప్రీం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహిన్‌ బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారితో చర్చించేందుకు సుప్రీంకోర్టు ఇద్దరు మధ్యవర్తులను నియమించింది. సంజయ్‌ హెగ్డే, సాధనా రామచంద్రన్‌లను మధ్యవర్తులుగా నియమించింది. ఆందోళనకారులతో మాట్లాడి రాకపోకలకు అంతరాయం కల్గకుండా మరో చోట నిరసన చేపట్టేలా చూడాలని వారికి సూచించింది.

షాహిబాగ్​ నిరసనలు మరోచోట చేపట్టేలా చూడండి: సుప్రీం

సుప్రీం ఆదేశాలతో షాహిన్‌బాగ్‌ చేరుకున్న ఇద్దరు మధ్యవర్తులు ఆందోళనకారులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు నిరసన తెలిపే హక్కును సమర్ధించిందని, తాము అందరి వాదనలు ఆలకిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: పురుషాధిక్యతకు చెక్​.. సైన్యంలో సమన్యాయం

Last Updated : Mar 1, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.