ETV Bharat / bharat

రాజ్​భవన్​ ఎదుట నిరసన చేయడం లేదు: కాంగ్రెస్​

author img

By

Published : Jul 26, 2020, 10:55 PM IST

Rajasthan Congress calls off its Monday protest in front of Raj Bhawan
రాజభవన్​ ఎదుట నిరసన చేయడం లేదు: కాంగ్రెస్​

రాజస్థాన్​ కాంగ్రెస్​ కీలక ప్రకటన చేసింది. సోమవారం రాజ్​భవన్​ ఎదుట నిరసనలు చేయమని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు గోవింద్​ సింగ్​ దోతసర ట్వట్టర్ వేదిక వెల్లడించారు.

రాజస్థాన్​ రాజ్​భవన్​​ ముందు సోమవారం నిరసనలు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతసర ట్వట్టర్​ వేదికగా తెలిపారు.

"సేవ్ డెమోక్రసీ- సేవ్​ కాన్‌స్టిట్యూషన్' ఆందోళన పిలుపులో భాగంగా సోమవారం... కాంగ్రెస్​ కార్యకర్తలు రాజభవన్​ ముందు నిరసన చేద్దామని అనుకున్నాం. అయితే మేం రాష్ట్రంలో అలాంటి ఆందోళనలు చేయకూడదని నిర్ణయించాం."

- గోవింద్​సింగ్ దోతసర, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు

ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​ నేతృత్వంలోని రాజస్థాన్​ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ... రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు అహింస మార్గంలో సోమవారం దేశవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని పార్టీ నేత అజయ్​ మాకెన్​ చెప్పారు.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్​ 'స్పీక్​ అప్​ ఫర్​ డెమొక్రసీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.