ETV Bharat / bharat

ఫేస్​బుక్​, వాట్సాప్​పై దర్యాప్తునకు రాహుల్ డిమాండ్

author img

By

Published : Sep 1, 2020, 12:30 PM IST

భారత్​లో ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల పనితీరుపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఓ మీడియా నివేదికను ఉటంకిస్తూ భాజపా- వాట్సాప్​ మధ్య క్విడ్​ప్రోకో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

BJP-FACEBOOK-RAHUL
రాహుల్

భారత్​లో సామాజిక దిగ్గజాలు ఫేస్​బుక్​, వాట్సాప్​ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరికీ జోక్యం చేసుకునే అధికారం లేదని వ్యాఖ్యానించారు.

భారత్​లో ఈ సంస్థల కార్యకలాపాలపై వస్తోన్న అంతర్జాతీయ మీడియా కథనాల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్.

BJP-FACEBOOK-RAHUL
రాహుల్ ట్వీట్

"భారత ప్రజాస్వామ్యం, సామాజిక సామరస్యంపై ఫేస్​బుక్, వాట్సాప్​ దాడి చేస్తున్నాయని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. దేశ వ్యవహారాల్లో విదేశీ సంస్థయినా, ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకునేందుకు వీలులేదు. వారిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలి. తప్పు చేసినట్లు గుర్తిస్తే శిక్షించాలి."

- రాహుల్ గాంధీ ట్వీట్

భాజపా-వాట్సాప్​..

వాట్సాప్​తో భాజపాకు సంబంధాలు ఉన్నాయని అంతకుముందు రాహుల్ ఆరోపించారు.

BJP-FACEBOOK-RAHUL
రాహుల్ ట్వీట్

"భాజపా-వాట్సాప్​ ఒప్పందాన్ని అమెరికా టైమ్​ మాగజైన్​ బయటపెట్టింది. భారత్​లో 40 కోట్ల మంది వాట్సాప్​ వినియోగదారులు ఉన్నారు. ఇక్కడ తన పేమెంట్​ సేవల ప్రారంభించేందుకు మోదీ ప్రభుత్వం సాయం వాట్సాప్​నకు అవసరం. అలా వాట్సాప్​పై భాజపాకు పట్టు లభించింది" అని రాహుల్​ ఆరోపణలు చేశారు.

'మార్క్'కు లేఖలు..​

ఇటీవలే భాజపా- ఫేస్​బుక్​ పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్​ జుకర్​బర్గ్​కు కాంగ్రెస్​ పార్టీ రెండు సార్లు లేఖలు రాసింది. భాజపా అనుకూల వైఖరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేసింది. టైమ్​ మ్యాగజైన్​లో వచ్చిన 'భాజపా-ఫేస్​బుక్​ క్విడ్​ప్రోకో' కథనంపై స్పందించాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'మీ చర్యలేంటి?'- ఫేస్​బుక్​కు కాంగ్రెస్ రెండో లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.