ETV Bharat / bharat

టీకా తయారీపై శాస్త్రవేత్తలకు మోదీ ప్రశంసలు

author img

By

Published : Nov 30, 2020, 1:49 PM IST

కరోనా వ్యాక్సిన్​ కోసం కృషి చేస్తోన్న మరో మూడు సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్​గా భేటీ అయ్యారు. వ్యాక్సిన్​ పురోగతిపై ఆరా తీశారు. శాస్త్రవేత్తల ప్రయత్నాన్ని ప్రధాని ప్రశంసించారు.

Modi
టీకా తయారీ: శాస్త్రవేత్తల కృషికి ప్రధాని ప్రశంసలు

కరోనా టీకా తయారీకై శాస్త్రవేత్తలు చేస్తోన్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వ్యాక్సిన్​ సామర్థ్యం, పురోగతిపై మరో మూడు సంస్థల ప్రతినిధులతో మోదీ చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

కొవిడ్​​ వ్యాక్సిన్​ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న జెనోవా బయోఫార్మా, బయెలాజికల్​ ఈ, డాక్టర్​ రెడ్డీస్​ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కొవిడ్​ టీకాను అభివృద్ధి చేస్తోన్న మూడు కీలక సంస్థలను ప్రధానమంత్రి.. నవంబర్​ 28న సందర్శించారు. అహ్మదాబాద్​లోని జైడస్​ క్యాడిలా, హైదరాబాద్​లోని భారత్​ బయోటెక్​, పుణెలోని సీరం సంస్థలకు వెళ్లారు. వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీకా ఉత్పత్తి, పంపణీ సన్నద్ధతపై చర్చించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.