ETV Bharat / bharat

నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు!

author img

By

Published : Mar 23, 2020, 5:14 AM IST

Updated : Mar 23, 2020, 6:16 AM IST

parliament-budget-session
నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిసే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో 12 రోజుల ముందుగానే ఉభయ సభలను వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు!

కరోనా వైరస్ సెగ భారత పార్లమెంట్​కు పాకింది. ప్రస్తుత బడ్జెట్​ సమావేశాలు నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. రెండు సభల్లో ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన అనంతరం సమావేశాలకు ముగింపు పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగాల్సి ఉంది. అయితే దేశంలో కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా 12 రోజుల ముందుగానే వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

తృణమూల్ కాంగ్రెస్, ఎన్​సీపీ సహా చాలా వరకు రాజకీయ పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పూర్తి నిర్బంధం విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉభయ సభలు వాయిదా పడటం లాంఛనమే కానుంది.

ఇదీ చూడండి: 'జనతా కర్ఫ్యూ ఆరంభం మాత్రమే.. పోరాటానికి సిద్ధమవ్వాలి'

Last Updated :Mar 23, 2020, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.