ETV Bharat / bharat

పరువు హత్య: గర్భవతిని చంపిన తల్లిదండ్రులు

author img

By

Published : Nov 1, 2020, 1:29 PM IST

కన్న కూతురినే కిరాతకంగా చంపి, ఎవరో చేసిన హత్యగా చిత్రీకరించాలనుకున్న ఆ తల్లిదండ్రులు చివరకు కటకటాలపాలయ్యారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. కూతురు పెళ్లి కాకుండానే గర్భవతి అయినందువల్ల వాళ్లు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Parents hack daughter to death for 'honour' in UP
కన్నకూతుర్నే నరికి చంపిన తల్లిదండ్రులు

పెళ్లి కాకుండానే గర్భవతి అయిన కూతుర్ని కిరాతకంగా నరికి చంపారు ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​ జిల్లా కిషన్​దాస్​పుర్​ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు. ఈ హత్యను ఎవరో చేసినట్టు చిత్రీకరించాలనుకున్నారు. కానీ దర్యాప్తులో దొరికిపోయి... జైలుపాలయ్యారు.

ఏం జరిగింది?

అక్టోబరు 25న ప్రతాప్​గఢ్​​ జిల్లా అలపుర్ రైల్వే స్టేషన్​ పరిధిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని నవాబ్​గంజ్​ పోలీసులు గుర్తించారు. తన కూతుర్ని ఎవరో హత్య చేశారని మృతురాలి తండ్రి కమలేష్ కుమార్​ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్​ఐఆర్ నమోదు చేసుకున్న నవాబ్​గంజ్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులనూ విచారించగా అసలు విషయం బయటపడింది.

ఎందుకు చంపారు?

"అస్వస్థతకు గురైన కూతుర్ని అక్టోబరు 24న తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు 6నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధరించారు. దీంతో అబార్షన్​ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. గర్భం వచ్చేందుకు కారణమైన వ్యక్తి ఎవరని ఎన్నిసార్లు అడిగినా ఆ యువతి సమాధానం చెప్పలేదు. విసుగు చెందిన తల్లిదండ్రులు ఆమెను నరికి చంపారు" అని నవాబ్​గంజ్​ పోలీస్​ స్టేషన్ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.