ETV Bharat / bharat

మహమ్మారిపై 'ధారావి' పోరు- కొత్తగా ఒకే ఒక్క కేసు

author img

By

Published : Jul 7, 2020, 9:50 PM IST

Updated : Jul 7, 2020, 10:11 PM IST

మహరాష్ట్ర ముంబయిలోని మురికివాడ ధారావిలో ఈ రోజు ఒకటే కరోనా కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ధారావిలో 2,335 మందికి వైరస్​ సోకినట్లు పేర్కొన్నారు.

Dharavi
మహమ్మారిపై 'ధారావి' పోరు

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడైన ధారావిలో ఈ రోజు ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ ఒక్క కేసు నమోదవటం ఇదే తొలిసారి. అయితే ఈ రోజు మరణాల సంఖ్యను మాత్రం అధికారులు వెల్లడించలేదు.

ధారావిలో ఇప్పటివరకు 352 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 1,735 మంది కోలుకున్నారు. ఈ ప్రాంతంలో ఏప్రిల్​ 1న తొలి కరోనా కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక్కడ కేసు నమోదైన 20 రోజుల తర్వాత ముంబయిలోని వ్యక్తికి వైరస్​ సోకటం గమనార్హం.

2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 6.5 లక్షల మంది నివసిస్తున్నారు. కరోనా నియంత్రణకు దేశంలోనే మార్గదర్శిగా నిలిచింది ధారావి. మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇక్కడి అధికారులు ఎంతో కృషిచేశారు.

ఇదీ చూడండి:'కరోనా కేసులు, మరణాల రేటు భారత్​లో అత్యల్పం'

Last Updated :Jul 7, 2020, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.