ETV Bharat / bharat

ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!

author img

By

Published : Jul 31, 2020, 7:10 AM IST

అప్పుడే పాఠశాలకు వెళ్లి.. కాస్తో కూస్తో చదవడం, రాయడం నేర్చుకుంటూ సరాదాగా గడిపే వయసది. లాక్​డౌన్​ కారణంగా విద్యాసంస్థలు మూతపడటం వల్ల.. విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. రోజూ టీవీలు, మొబైల్​ గేమ్​లతో కాలక్షేపం చేయడమే కొందరి పనైంది. అలా టీవీలో వచ్చిన ఓ సీరియల్​.. తనలో రచయిత్రిని కదలించింది. తెరపై కనిపించే ఆ దృశ్యాల్ని పుస్తకంలో ఉంచాలనుకుంది ఓ ఎనిమిదేళ్ల చిన్నారి. అతిపిన్న వయసులో పవిత్ర రామాయాణ గ్రంథాన్ని లిఖించి రికార్డు సృష్టించింది.

Odisha girl becomes youngest to write Ramayana within 22 days
ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!

ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!

ఎనిమిదంటే ఎనిమిదేళ్లు.. ఈ వయసులో ఎవరైనా ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. అయితే ఓ చిన్నారి.. ఏకంగా రామాయణ ఇతిహాసాన్నే రాసేసింది. ఈ పురాణేతిహాసాన్ని లిఖించడానికి మహామహులే నెలల తరబడి సమయాన్ని వెచ్చిస్తారు. అయితే ఒడిశాకు చెందిన ఇషితా ఆచారి మాత్రం 22 రోజుల్లోనే పూర్తి చేసి ఔరా! అనిపించుకుంది.

ఒడిశాలోని బెర్హంపుర్​కు చెందిన ఇషితా.. తన తల్లిదండ్రులతోపాటు తమిళనాడులోని చెన్నైలో నివాసముంటోంది. లాక్​డౌన్​ కాలంలో రామాయణమనే ఐకానిక్​ టెలీ సీరియల్​ చూసిన ఈ చిన్నారి.. ఆ గ్రంథాన్నే రాసేందుకు పూనుకుంది. తక్కువ కాలంలోనే రామాయాణాన్ని రాసిన అతిపిన్న వయస్కురాలిగా ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​-2020 అవార్డు అందుకుంది.

Certificate of India Book of Records
ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​-2020 ప్రశంసా పత్రం

టీవీలో ప్రసారమయ్యే రామాయణం నాటిక చూశాక.. ఎలాగైనా ఈ పుస్తకాన్ని రాయాలనుకున్నట్లు చెప్పింది ఇషితా.

'రామాయణం చూశాక.. ఈ పవిత్ర గ్రంథాన్ని రాయాలనిపించింది. మే నెలలో లిఖించడం ప్రారంభించాను. 22 రోజుల్లో మొత్తం రామాయాణాన్ని కుదించి 57 పేజీల్లో పూర్తిచేశాను.'

- ఇషితా ఆచారి

ఇదీ చదవండి: దర్శకుడు రాజమౌళి​.. 'రామాయణం' తీయాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.