ETV Bharat / bharat

'బడ్జెట్​ సమావేశాల్ని కుదించే ప్రసక్తే లేదు'

author img

By

Published : Mar 13, 2020, 5:21 PM IST

No question of curtailing Budget Session: Parliamentary affairs minister
'బడ్జెట్​ సమావేశాల్ని కుదించే ప్రసక్తే లేదు'

బడ్జెట్​ సమావేశాలను కుదిస్తారనే వార్తలను తోసిపుచ్చారు పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి. ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశాలను కుదించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ఏప్రిల్​ 3 వరకు జరగనున్న ప్రస్తుత బడ్జెట్​ సమావేశాలను కుదిస్తారనే వార్తలను ఖండించారు పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. నిర్దేశిత తేదీల వరకు జరిగి తీరతాయని స్పష్టం చేశారు.

జనవరి 31న ప్రారంభమైన తొలి విడత బడ్జెట్​ సమావేశాలు ఫిబ్రవరి 11తో ముగిశాయి. మార్చి 2న ప్రారంభమైన రెండో విడత సమావేశాలను ఏప్రిల్​ 3 వరకు కొనసాగించనున్నట్లు ప్రహ్లాద్​ జోషి తెలిపారు.

ఇదీ చదవండి: 'ఎన్‌పీఆర్‌'కు ఏ పత్రమూ ఇవ్వక్కర్లేదు: షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.