ETV Bharat / bharat

నిర్భయ: భారీ బందోబస్తు మధ్య తిహార్​కు తలారి 'పవన్​'

author img

By

Published : Jan 29, 2020, 3:14 PM IST

Updated : Feb 28, 2020, 10:02 AM IST

Nirbhaya case
నిర్భయ: భారీ బందోబస్తు మధ్య తిహార్​కు తలారి 'పవన్​'

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు తిహార్​ జైలు అధికారులు. శిక్ష అమలు చేసే తలారి.. పవన్​ జల్లాద్​ను రేపు జైలుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో పవన్​కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అత్యంత భద్రత కలిగిన జైలు వ్యాన్​లో 20 మంది సాయుధ బలగాల మధ్య జైలుకు చేరుకోనున్నారు పవన్​.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సమయం దగ్గర పడుతున్న క్రమంలో మరణశిక్ష అమలు చేసేందుకు ఎంపికైన తలారి పవన్​ జల్లాద్​​ గురువారం తిహార్​ జైలుకు చేరుకోనున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​ నుంచి దిల్లీకి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

భారీ భద్రత నడుమ..

పవన్​ జల్లాద్​ను జైలుకు తరలించేందుకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 15-20 మంది సాయుధ పోలీసులు భద్రత కల్పిస్తారని.. ఇందుకోసం అత్యంత పటిష్ఠమైన జైలు వ్యాన్​ను వినియోగించనున్నట్లు వెల్లడించారు.

"భారీ భద్రత మధ్య తలారి పవన్ జల్లాద్​​ను గురువారం ఉదయం తిహార్​ జైలుకు తీసుకొస్తాం. దిల్లీకి చేరుకున్న వెంటనే జైలులో ఉరి అమలు చేసే విభాగానికి తరలిస్తాం."

- సందీప్​ గోయల్​, తిహార్​ జైలు డైరెక్టర్​ జనరల్​.

మేరఠ్​ నుంచి దిల్లీకి ఏ మార్గంలో తరలించాలో ఇప్పటికే నిర్ణయించారు అధికారులు. అయితే.. అందులో మార్పు ఉండొచ్చని చెబుతున్నారు. దిల్లీ పోలీసులతోపాటు తమిళనాడు ప్రత్యేక దళం ఇందులో పాల్గొనుంది.

ఫిబ్రవరి 1న..

నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్​.. క్షమాభిక్ష​ తిరస్కరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయగా దానిని న్యాయస్థానం కొట్టి వేసింది. మరో దోషి అక్షయ్ క్యురేటివ్ పిటిషన్​ దాఖలు చేశాడు. దీనిపైనా స్పష్టత వచ్చి, న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలిగిపోతే.. నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరి తీయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

నలుగురు దోషులు ముకేశ్​(32), పవన్​ గుప్తా(25), వినయ్​ శర్మ(26), అక్షయ్​ సింగ్​ (31)లను వారి బంధువులు, కుటుంబ సభ్యులు గత మంగళవారం కలిశారు.

ఇదీ చూడండి: సుప్రీంలో నిర్భయ దోషికి చుక్కెదురు- వ్యాజ్యం కొట్టివేత

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL30
EC-PARVESH VERMA
EC issues showcause notice to BJP MP Verma for controversial statement
         New Delhi, Jan 29 (PTI) The Election Commission on Wednesday issued a showcause notice to BJP MP Parvesh Verma for his controversial statement, saying prime facie the remarks had the potential of disturbing harmony.
          The EC asked him to respond to the notice before noon on Thursday. It said if he fails to respond, the EC will take a decision without any further reference to him.
          West Delhi MP Verma on Tuesday said what happened in Kashmir with Kashmiri Pandits could happen in Delhi, warning that lakhs of anti-CAA protesters in Shaheen Bagh could enter homes to kill and rape women. PTI NAB ASG
DV
DV
01291416
NNNN
Last Updated :Feb 28, 2020, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.