ETV Bharat / bharat

భారత్​కు నీటి సరఫరాను నిలిపివేసిన నేపాల్​

author img

By

Published : May 28, 2020, 9:52 PM IST

nepal stopped water supply near bhikhnathori border in west champaran
భారత్​కు నీటి సరఫరాను నిలిపివేసిన నేపాల్​

బిహార్​లోని ఇండో-నేపాల్​ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భిఖనటోడీ ప్రాంతం వద్ద నేపాల్​ నుంచి రెండు నాలాలు భారత్​ భూభాగానికి వస్తాయి. తాజాగా ఇందులో ఒక దానిని నేపాల్​ పూడ్చివేసింది. దీనిపై ఆగ్రహించిన భారత రైతులు.. వేలాదిగా సరిహద్దు వద్దకు తరలివెళ్లారు. నీటి సరఫరాకు ఆటంకం కలిగించవద్దని నినాదాలు చేశారు.

భారత్​తో సరిహద్దు విషయంలో నేపాల్​ రోజురోజుకు మితిమీరుతోంది. కాలాపానీ తమదేనని ఇటీవలే కొత్త మ్యాప్​ను విడుదల చేసింది. ఇప్పుడు మరో సరిహద్దు ప్రాంతమైన భిఖనటోడీ వద్ద నీటి సరఫరాను నిలిపివేసింది. ఫలితంగా బిహార్​లోని 7 గ్రామాలకు చెందిన వేలాది రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

nepal stopped water supply near bhikhnathori border in west champaran
సరిహద్దులో ఉద్రిక్తత

ఇదీ జరిగింది...

బిహార్​లోని పశ్చిమ చెంపారన్​కు చెందిన భిఖనటోడీ.. ఓ సరిహద్దు ప్రాంతం. నేపాల్​ సరిహద్దులోని పిల్లర్​ నెం. 435/1 నుంచి రెండు నాలాలు భారత్​లోకి ప్రవహిస్తుంటాయి. వీటితో బిహార్​లోని 7 గ్రామాల్లో వేలాది ఎకరాలకు నీటి సరఫరా జరిగేది. తాజాగా భారత్​తో ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో నేపాల్​ యంత్రాంగంతో కలిసి రోడ్డు కాంట్రాక్టర్లు ఒక నాలాను పూడ్చివేశారు. ఫలితంగా భారత్​కు నీటి సరఫరా నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని నేపాల్​ అధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్యకు గల కారణాలను వివరించడానికి ప్రయత్నించారు నేపాల్​ అధికారులు. వంతెన నిర్మాణానికి అడ్డువస్తోందనే.. ఓ నాలను మూసివేసినట్టు... మిగిలిన నాలానే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని తేల్చిచెప్పారు.

దీంతో ఆగ్రహించిన వేలాది మంది రైతులు సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు. అన్ని నాలాల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

భిఖనటోడీ సరిహద్దులో అనేక మార్లు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి 2013లో నీటిసరఫరాపై ఓ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం పండాయ నది నుంచి 30 శాతం నీటిని భారత్​కు వదలాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.