ETV Bharat / bharat

కరోనా జాగ్రత్తలతో నీట్​ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : Sep 12, 2020, 5:40 PM IST

కరోనా కాలంలో నిర్వహిస్తోన్న నీట్ పరీక్ష కోసం జాతీయ పరీక్షల ఏజెన్సీ(ఎన్​టీఏ) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం కోసం పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచి.. ఒక్కో గదిలో విద్యార్థుల సంఖ్యను కుదించారు. మాస్కు, శానిటైజర్​ తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు అధికారులు.

MOE-NEET
నీట్​

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం జాతీయస్థాయిలో జరిగే నీట్‌ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్​టీఏ) కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టింది.

భౌతికదూరం నిబంధన పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల సంఖ్య 2,546 నుంచి 3,834కు పెంచారు. ఒక్కో గదిలో విద్యార్థుల సంఖ్యను 24 నుంచి 12కు తగ్గించారు. గతంలో 2 సార్లు వాయిదా పడిన నీట్‌కు దేశవ్యాప్తంగా 15.97లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు..

బార్‌ కోడ్‌ ద్వారా హాల్‌ టికెట్ల పరిశీలన, పరీక్ష కేంద్రాల పెంపు, ప్రత్యామ్నాయ సీటింగ్‌, పరీక్ష గదిలో విద్యార్థుల సంఖ్య తగ్గింపు, విద్యార్థుల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల్లో తగిన చర్యలు తీసుకున్నట్లు ఎన్​టీఏ తెలిపింది.

మాస్కు.. శానిటైజర్..

పరీక్ష కేంద్రాల వద్ద, పరీక్ష హాల్లో శానిటైజర్‌ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు మాస్క్‌ ధరించి రావటంతోపాటు శానిటైజర్‌ వెంట తెచ్చుకోవాలని పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత అధికారులు ఇచ్చే మాస్క్‌లు ధరించాలని సూచించారు.

ఇదీ చూడండి: కరోనా నిబంధనలు పాటిస్తూ.. జేఈఈ మెయిన్స్​ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.