ETV Bharat / bharat

వరద గుప్పిట్లోనే అసోం.. సహాయక చర్యలు ముమ్మరం

author img

By

Published : Jul 13, 2020, 10:58 AM IST

అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని 24 జిల్లాలు ముంపునకు గురైనట్లు అధికారులు ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అసోంలోని 24 జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. 950 గ్రామాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. వందలాది ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. 85,546 హెక్టార్ల పంట భూమి నీట మునిగినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 18 జిల్లాల్లోని రోడ్లు, వంతెనలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

వరదల కారణంగా దాదాపు 8 లక్షలకుపైగా పెంపుడు జంతువులు, 4.24 లక్షలకు పైగా పౌల్ట్రీలు ప్రభావితమయ్యాయి.

నీట మునిగిన దేవాలయం

శిబిరాలకు తరలింపు..

వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది అధికార యంత్రాంగం. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తలించేందుకు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో పాటు ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారికి నిత్యవసరాలను అందజేస్తున్నారు అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరికీ మాస్క్​లు పంపిణీ చేస్తున్నారు.

ఇదీ చూడండి:విద్యార్థుల ప్రతిభను కొలవాల్సిందే: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.