ETV Bharat / bharat

ఆత్మనిర్భర్​ భారత్​​ 'లోగో' రూపకల్పనకు ఆహ్వానం

author img

By

Published : Aug 1, 2020, 5:25 AM IST

ఆత్మనిర్భర్​ భారత్​ అభియాన్​ 'లోగో' రూపకల్పనకు 'మై గవర్నమెంట్​.ఇన్'​ ఆధ్వర్యంలో పోటీ నిర్వహిస్తోంది కేంద్రం. పౌరులు సృజనాత్మక ఆలోచనలతో లోగో రూపొందించాలని ఆహ్వానించింది. ఈ పోటీలో పాల్గొనేందుకు దరఖాస్తుకు ఆగస్టు 5 వరకు తుది గడువు ఇచ్చింది.

AatmaNirbhar Bharat Logo Design
ఆత్మనిర్భర్​ భారత్​​ 'లోగో' రూపకల్పనకు ఆహ్వానం!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆత్మనిర్భర్​ భారత్​ అభియాన్​కు ప్రత్యేకమైన గుర్తింపు కోసం పౌరుల నుంచి సృజనాత్మక ఆలోచనలతో లోగో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మై గవర్నమెంట్​.ఇన్ వెబ్​సైట్​ ద్వారా లోగో రూపొందించేందుకు పోటీ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

" సరికొత్త ఆవిష్కరణ, స్వావలంబన స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు మై గవర్నమెంట్​.ఇన్​ ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్​ భారత్​ లోగో రూపకల్పన​ పోటీ నిర్వహిస్తున్నాం. ప్రజలను భాగస్వాములుగా చేసే మైగవర్నమెంట్​ వెబ్​సైట్​ ఇప్పటికే పలు విభాగాలకు లోగోను రూపొందించింది. అందులో స్వచ్ఛ భారత్​, దేకో అప్నాదేశ్​, లోక్​పాల్​ వంటివి ఉన్నాయి."

- ప్రకటన

రూ.25వేల బహుమతి

ఈ పోటీలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవటానికి ఆగస్టు 5 వరకు తుది గడువు విధించింది కేంద్రం. పోటీలో విజేతగా నిలిచిన లోగోకు రూ. 25,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి: ఆగస్టు 1న ఆన్​లైన్​ 'హ్యాకథాన్'లో ప్రధాని ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.