ETV Bharat / bharat

ఈ ఏడు మార్చి నుంచే భానుడి భగభగలు

author img

By

Published : Feb 28, 2020, 5:28 PM IST

Updated : Mar 2, 2020, 9:13 PM IST

Mar-May period likely to be warmer than normal: IMD
ఈ ఏడు మార్చి నుంచే ఎండాకాలం

ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. కొన్ని రాష్ట్రాల్లో మార్చి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించనున్నట్లు తెలిపింది.

సాధారణంగా ఏప్రిల్​, మే, జూన్​ నెలల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి మాత్రం గతంలో కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడమే కాకుండా.. మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపనున్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ.

ఈ ఏడాది వాయువ్య, పశ్చిమ, మధ్య, దక్షిణ భారత్​లోని కొన్ని ప్రాంతాల్లో మార్చి నుంచే సూర్యుడు భగ్గుమననున్నాడని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్​లోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే రాష్ట్రాలివే..

పంజాబ్​, హిమాచల్​ప్రదేశ్​, దిల్లీ, ఉత్తరాఖండ్​, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్​ప్రదేశ్​, గుజరాత్​, మధ్యప్రదేశ్, బిహార్​, ఛత్తీస్​గఢ్​, ఝార్ఖండ్​, బంగాల్​​, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని తీరప్రాంతం, మహారాష్ట్రలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.

ఇదీ చదవండి: దిల్లీ: క్రమంగా సాధారణ స్థితి.. 39కి చేరిన మృతులు

Last Updated :Mar 2, 2020, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.