ETV Bharat / bharat

'మహా'లో తగ్గిన కేసులు- మరో 10వేల మందికి కరోనా

author img

By

Published : Oct 5, 2020, 8:38 PM IST

భారత్​లో కరోనా కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

Maharashtra's COVID-19 tally reaches 14,53,653 with 10,244 new cases
మహాలో తగ్గిన కరోనా ఉద్ధృతి- కొత్తగా 10వేలు కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మహారాష్ట్రలో తాజాగా 10,244 కేసులు నమోదవగా.. 263మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 14 లక్షల 54వేలకు చేరువైంది.

తమిళనాడులో కొత్తగా 5,395మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 25వేలు దాటింది.

  • కేరళలో కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. తాజాగా 5,042 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో మరో 63 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా 3,064మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 17వేలు దాటింది.
  • ఒడిశాలో తాజాగా 2,617కేసులు వెలుగుచూశాయి. 17మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో ఒక్కరోజే 1,947 కేసులు నమోదవగా.. 32మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 92వేల 560కు చేరింది.
  • గుజరాత్​లో 1,327మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలగా.. మరో 13మంది మరణించారు.

ఇదీ చూడండి: డీకేఎస్​కు 'అక్రమాస్తుల' చిక్కులు- 57లక్షలు జప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.