ETV Bharat / bharat

'రాజకీయ చర్చలతోనే ఎల్​ఏసీ సమస్య పరిష్కారం'

author img

By

Published : Jun 7, 2020, 11:55 AM IST

భారత్​-చైనా వాస్తవాధీన రేఖ వద్ద తలెత్తిన ఉద్రిక్తతలపై ఇరు దేశాల సైనికాధికారులు కలిసి చర్చలు జరిపితే ఎటువంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు మాజీ సైనిక లెఫ్టినెంట్​ జనరల్​ రాకేశ్ శర్మ. రాజకీయ చర్చలతోనే ఈ సమస్య పరిష్కారమవుతోందని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు.

LAC issue has to be resolved at political level, says former Army officer
రాజకీయ చర్చలతోనే 'ఎల్​ఏసీ' సమస్య పరిష్కారం

భారత్​-చైనా వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వద్ద కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదానికి తెరదించే లక్ష్యంతో శనివారం భారత- చైనా దేశాల లెఫ్టినెంట్ జనరల్​ స్థాయి అధికారుల భేటీ జరిగింది. అయితే ఎల్​ఏసీ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఓ విధానం ఉందని, కానీ 2013 నుంచి రాజకీయ స్థాయిలో విఫలమవుతోందని అభిప్రాయపడ్డారు మాజీ సైనిక లెఫ్టినెంట్​ జనరల్​ రాకేశ్​ శర్మ.

ఈ సమస్యపై రాజకీయ నాయకుల స్థాయిలో తప్ప సైనికాధికారుల చర్చల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో వివరించారు రాకేశ్.

మాజీ సైనిక లెఫ్టినెంట్​ జనరల్​ రాకేశ్ శర్మతో ముఖాముఖి

ఇదీచూడండి: నాట్ల సమయంలోనూ మిడతల దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.