ETV Bharat / bharat

కశ్మీర్​ యువతలో మార్పు.. ఉగ్రవాదానికి నో!

author img

By

Published : Feb 4, 2020, 4:34 PM IST

Updated : Feb 29, 2020, 3:58 AM IST

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం.. ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపే కశ్మీరీ యువత సంఖ్య భారీగా పడిపోయినట్టు అధికార గణాంకాలు వెల్లడించాయి. 2019 ఆగస్టు 5 తర్వాత కేవలం 54మంది ఉగ్ర ముఠాల్లో చేరారని.. 2018తో పోల్చితే ఇది 60శాతం తక్కువని పేర్కొన్నాయి. కానీ పాక్​ ఉగ్రవాదుల చొరబాట్లు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి.

J-K: Drop in locals joining militancy but infiltration from Pak continues unabated
కశ్మీర్​ యువతలో మార్పు.. ఉగ్రవాదానికి నో!

కశ్మీర్​ యువతలో మార్పు.. ఉగ్రవాదానికి నో!

జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత.. ఉగ్రవాద ముఠాల్లో చేరుతున్న కశ్మీరీ యువత సంఖ్య తగ్గిపోయినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 ఆగస్టు 5 నుంచి 2020 జనవరి 26 వరకు జమ్ముకశ్మీర్‌ నుంచి కేవలం 28 మంది యువత మాత్రమే ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపినట్లు భద్రతా విభాగం.. ఓ అంతర్గత నివేదికలో పేర్కొంది.

గతేడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఉగ్రవాదం వైపు అడుగులు వేసిన యువత సంఖ్య కంటే ఇది 60 శాతం తక్కువ. ఆ సమయంలో ఎక్కువగా పుల్వామా, అనంత్‌నాగ్, కుల్‌గావ్‌, షోపియాన్‌ జిల్లాలకు చెందిన 105 మంది యువత ఉగ్రవాద గ్రూపులతో చేతులు కలిపారు. 2018తో పోలిస్తే... 2019లో ఆ సంఖ్య 35 శాతం తగ్గినట్లు భద్రతా విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

చొరబాట్లు ఆందోళనకరంగానే...

మరోవైపు భారత్‌లోకి చొరబడేందుకు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం తగ్గలేదు. గతేడాది 211 మంది ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోకి చొచ్చుకువచ్చే ప్రయత్నాలు చేశారు. వారిలో 74 మంది పీఓకేలోకి తిరిగి వెళ్లిపోగా.. నలుగురిని సైన్యం మట్టుబెట్టినట్లు భద్రతా విభాగం నివేదికలో పేర్కొంది

ZCZC
URG GEN NAT
.NEWDEL PAR11
LS-DEBATE-THAROOR
Facts gave way to fiction in President's address: Tharoor
         New Delhi, Feb 4 (PTI) Congress leader Shashi Tharoor on
Tuesday accused the government in Lok Sabha of abrogating its
moral responsibility of dealing with the "constitutional and
political crisis" facing the country and said facts gave way
to fiction in the President's address to Parliament.
         Participating in the debate on the Motion of Thanks to
the President's address, the Congress member said there was a
dearth of solutions and ideas to take India forward and
attempts were made to "mask" failures of various schemes
launched by the government. PTI NAB
DV
DV
02041533
NNNN
Last Updated :Feb 29, 2020, 3:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.