ETV Bharat / bharat

హైదరాబాద్ నుంచి డ్రగ్స్ రవాణా- 70 కిలోలు సీజ్

author img

By

Published : Jan 6, 2021, 9:26 PM IST

Indore cop seize MDMA drugs from five accused
హైదరాబాద్ నుంచి డ్రగ్స్ రవాణా- 70 కిలోలు సీజ్

మధ్యప్రదేశ్​లో మాదకద్రవ్యాల రవాణా గుట్టురట్టు చేశారు పోలీసులు. రూ. 70 కోట్ల విలువైన డ్రగ్స్​ను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇందోర్​కు వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ ఫ్యాక్టరీ నెలకొల్పిన వ్యక్తి.. సరఫరా చేసినట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికాకు వీటిని పంపించాలని నిందితులు అనుకున్నారని స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్​లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 70 కిలోల ఎండీఎంఏ(మిథైల్ ఎనిడియోక్సి మెథాంఫేటమిన్)ను ఇందోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో ఈ డ్రగ్స్ విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. దేశంలో భారీగా పట్టుబడ్డ మాదకద్రవ్యాల్లో ఇది ఒకటని వెల్లడించారు.

Indore cop seize MDMA drugs from five accused
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​తో పోలీసులు

ఈ డ్రగ్స్​ను హైదరాబాద్ నుంచి ఇందోర్​కు తరలిస్తున్నారని ఇందోర్ అదనపు డీజీపీ యోగేశ్ దేశ్​ముఖ్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 13 లక్షలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

"హైదరాబాద్​లో నివాసం ఉండే వేద్ ప్రకాశ్ వ్యాస్.. డ్రగ్స్​ డెలివరీ చేయడానికి తన డ్రైవర్​తో పాటు ఇందోర్​కు వచ్చాడు. క్రైమ్ బ్రాంచ్ అదనపు ఎస్పీ గురుప్రసాద్ పరాషార్​ వీరి గురించి సమాచారం అందుకున్నారు. వెంటనే స్పందించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు."

-యోగేశ్ దేశ్​ముఖ్, ఇందోర్ అదనపు డీజీపీ

ఇందోర్ నుంచి దక్షిణాఫ్రికాకు ఈ మాదకద్రవ్యాలను సరఫరా చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు దేశ్​ముఖ్ వెల్లడించారు.

డ్రగ్స్ సరఫరా చేసిన వ్యాస్.. ఇదివరకు ఓ ఫార్మా సంస్థలో పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఇందోర్, ఉజ్జయిన్, మంద్​సౌర్​లో నివాసం ఉండేవాడని చెప్పారు. ఇటీవలే తెలంగాణలో ఔషధ ఫ్యాక్టరీ నెలకొల్పాడని.. ఎండీఎంఏ డ్రగ్​ను ఔషధాల తయారీలో ఉపయోగించకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: లైవ్​లో ఆత్మహత్యాయత్నం.. పోలీసుల చాకచక్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.