ETV Bharat / bharat

ఇండిగో విమానానికి తప్పిన పెనుముప్పు

author img

By

Published : Jan 17, 2021, 2:26 PM IST

సూరత్​ నుంచి కోల్​కతాకు 172 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ విమానం.. భోపాల్​లో అత్యవసరంగా ల్యాండింగ్​ అయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

indigo flight emergency landing
ఇండిగో విమానానికి తప్పిన పెనుముప్పు!

ఇండిగో విమానం ఆదివారం పెను ప్రమాదం నుంచి బయటపడింది. సూరత్​ నుంచి కోల్​కతా పయనమైన ఈ విమానం.. మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో అత్యవసరంగా ల్యాండ్​ అయింది. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే విమాన దారిని మళ్లించి మధ్యలో ల్యాండ్​ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం.

ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సురక్షితంగా భోపాల్​లో విమానం ల్యాండ్​ అయినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:హవాలా రాకెట్​: ఈడీ కస్టడీకి ఇద్దరు చైనీయులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.