ETV Bharat / bharat

మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 46 వేల కేసులు

author img

By

Published : Nov 21, 2020, 9:53 AM IST

Updated : Nov 21, 2020, 10:06 AM IST

India's total cases
దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా

భారత్​లో కొత్తగా 46,232 మందికి వైరస్​ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90.50 లక్షలు దాటింది. మరో 564 మంది మహమ్మారితో మరణించారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్థిరంగా పెరుగుతోంది. తాజాగా 46,232 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 564 మంది మహమ్మారికి బలయ్యారు.

India's total cases
దేశంలో కరోనా కేసుల వివరాలు

దేశంలో కొత్తగా 49,715 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారి కేసులతో పోలిస్తే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది.

శుక్రవారం మొత్తం 10,66,022 పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు చేపట్టిన మొత్తం పరీక్షల సంఖ్య 13,06,57,808కి చేరింది.

ఇదీ చూడండి: 'చిన్నారుల భవితను ప్రమాదంలోకి నెట్టొద్దు'

Last Updated :Nov 21, 2020, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.