ETV Bharat / bharat

భారతీయ రైల్వే ఆదాయంలో భారీ క్షీణత

author img

By

Published : Nov 3, 2020, 3:45 PM IST

ప్యాసింజర్​ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల భారతీయ రైల్వే ఆదాయం భారీగా క్షీణించింది. గతేడాదితో పోల్చితే 90శాతం తగ్గి.. రూ. 3,322కోట్లను ఆర్జించింది.

Indian Railways reports 90% revenue dip in passenger segment
భారతీయ రైల్వే ఆదాయంలో భారీ క్షీణత

భారతీయ రైల్వే ఆదాయానికి కరోనా లాక్​డౌన్​ భారీగా గండి కొట్టిండి. ప్యాసింజర్​ రైళ్లు నిలిచిపోవడం వల్ల.. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఆదాయంలో 90శాతం క్షీణించింది. మొత్తం మీద ఈ ఏడాది రూ. 3,322కోట్లు ఆర్జించినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్​ వినోద్​ కుమార్​ వెల్లడించారు..

"ప్యాసింజర్​ సెగ్మెంట్​ ద్వారా రైల్వే రూ. 3,322కోట్లను సంపాదించింది. గతేడాదితో పోల్చితే ఇది 90శాతం తక్కువ. ప్యాసింజర్ రైళ్లను పుర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వలతో కలిసి పనిచేస్తున్నాం. కరోనా పరిస్థితులను సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటాం. అయితే కచ్చితమైన తేదీని ఇప్పుడే చెప్పలేం.​"

--- వినోద్​ కుమార్​, రైల్వే బోర్డు ఛైర్మన్​.

ప్రస్తుతం 736 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది భారతీయ రైల్వే. వీటితో పాటు పండుగల సందర్భంగా అక్టోబర్​ 20 నుంచి ఈ నెల 30 వరకు అదనంగా మరో 436 రైళ్లను నడుపుతోంది.

మరోవైపు సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం 9శాతం వృద్ధి చెందినట్టు వెల్లడించారు వినోద్​. గతేడాదితో పోల్చితే ఇది రూ. 869కోట్లు ఎక్కువని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- 1.25 కోట్ల రైలు టికెట్లు రద్దు.. కారణమిదే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.