ETV Bharat / bharat

'హెర్డ్​ ఇమ్యూనిటీ దేశంలో ఎక్కడా లేదు'

author img

By

Published : Sep 27, 2020, 9:51 PM IST

ఐసీఎంఆర్​ నిర్వహించిన రెండవ సెరో-సర్వే ప్రకారం.. భారతీయుల్లో ఇప్పటికీ హెర్డ్​ ఇమ్యూనిటీ వచ్చిన సూచనలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కొవిడ్ నియమ, నియబంధనలను తప్పనిసరిగా పాటించాల్సేందనంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్​.

2nd sero-survey
'హెర్డ్​ ఇమ్యూనిటీ దేశంలో ఎక్కడా రాలేదు'

కొవిడ్ నుంచి రక్షణ కల్పించే హెర్డ్​ ఇమ్యూనిటీ దేశ ప్రజల్లో ఇంకా అభివృద్ధి కాలేదని అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్. ఈ నేపథ్యంలో ప్రజలు బహిరంగ, సామూహిక ప్రదేశాల్లో మాస్క్​ ధరించటం సహా.. కొవిడ్​ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

కొవిడ్​-19 రీ-ఇన్​ఫెక్షన్లపై ఐసీఎంఆర్ ప్రత్యేక దృష్టి సారించిందని.. అయితే ప్రస్తుతానికి ఆ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు కేంద్ర మంత్రి. అదే సమయంలో త్వరలో విడుదలకానున్న సెరో సర్వే తుది ఫలితాలను ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. సండే సంవాద్​ ఆన్​లైన్​ కార్యక్రమంలో నెటిజన్లతో ఆయన ముచ్చటించారు.

ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా పోరాడితేనే మహమ్మారిని ఓడించగలమన్న కేంద్ర మంత్రి.. ప్రైవేట్​ ఆస్పత్రులకు కొవిడ్​ చికిత్సా విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశామని వెల్లడించారు. అలాగే కరోనా వైరస్​ రూపాంతరం చెందుతూ ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలను దెబ్బతీస్తున్న నేపథ్యంలో.. వైద్య నిపుణులతో ఈ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని తెలియజేశారు.

Vardhan
కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్​

ప్రైవేట్​ ఆస్పత్రుల అధిక ఛార్జీలకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులతో చర్చించామని హర్షవర్ధన్​ తెలిపారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని.. 2025 నాటికి జీడీపీలో 1.15 నుంచి 2.5 శాతం ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఏడాదిలో మే నెలలో విడుదలైన మొదటి సెరో-సర్వే నివేదిక... దేశంలో కరోనా వైరస్​ ఇన్​ఫెక్షన్​ రేటు 0.73గా ఉన్నట్లు తేల్చింది. రెండో సెరో-సర్వే ఫలితాలు తర్వలో విడుదల కానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.