ETV Bharat / bharat

తుపాకీతో పిల్లిని బలిగొన్న కిరాతకులు

author img

By

Published : Aug 25, 2020, 2:44 PM IST

Firing on a cat: owner filed a case in police station in banglore
పిల్లిని కాల్చి చంపిన దుండగులు!

కర్ణాటకలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఓ పిల్లిపై కాల్చి చంపారు దుండగులు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.

బెంగళూరులో ఓ పిల్లిని హత్య చేశారు దుండగులు. పిల్లి యజమాని గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు.

అబ్రహాం ఆంటోనీ.. స్థానిక స్కైహైక్ విల్లాస్​లో నివాసముంటున్నాడు. ఓ పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి వెనక పెరట్లో రెండు సార్లు కాల్పులు జరిగిన శబ్ధం వినిపించి పరిగెత్తుకెళ్లాడు అబ్రహాం. ఆ తుపాకీ తూటాలు తగిలి, తన పెంపుడు పిల్లి నెత్తుటి మడుగుల్లో పడి ఉండడం చూసి బెంబేలెత్తిపోయాడు. వెంటనే సర్జాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

Firing on a cat: owner filed a case in police station
పిల్లి శరీరంపై తుపాకీ తూటాలు

కేసు నమోదు చేసుకున్న పోలీలుసులు.. పిల్లి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పశువైద్యశాలకు తరలించారు. పిల్లిపై కాల్పులు జరిపిందెవరనే కోణంలో విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి : ఔరా: సుద్దముక్క, పెన్సిల్ నిబ్​పై గణేశుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.