ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​: 7 రోజుల్లో నాలుగు సార్లు భూకంపం

author img

By

Published : Sep 29, 2020, 4:30 PM IST

జమ్ముకశ్మీర్​ లేహ్​లో భూమి కంపించింది. భూకంప లేఖినిపై 3.2 తీవ్రతగా నమోదయింది. గడిచిన ఏడురోజుల్లో ఈ ప్రాంతంలో భూమి కంపించడం ఇది నాలుగోసారి.

Earthquake of magnitude 3.2 on the Richter scale occurred near Alchi (Leh)
జమ్ముకశ్మీర్​లో భూకంపం.. రిక్టర్​ స్కేలుపై 3.2 తీవ్రత

జమ్ముకశ్మీర్​ లేహ్​ జిల్లాలోని అల్చిలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 3.2 తీవ్రతగా నమోదైంది. మధ్యాహ్నం 2.30 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించినట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. గడిచిన ఏడురోజుల్లో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించడం ఇది నాలుగోసారి.

లద్దాఖ్​లో గడిచిన శుక్రవారం కూడా 5.4, 3.6 మధ్యస్థాయి తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించింది. ఈ విధంగా తరుచూ భూకంపాలు రావడం వల్ల ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి: వచ్చే వారం జపాన్​లో జైశంకర్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.