ETV Bharat / bharat

కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్​

author img

By

Published : Sep 19, 2020, 5:18 PM IST

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్​ అశ్వత్​ నారాయణ్​కు కరోనా సోకింది. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కొవిడ్​ టెస్టు చేయించుకోగా... వైరస్​ పాజిటివ్​గా తేలింది. ఉత్తరాఖండ్​ ప్రతిపక్షనేతకు కూడా కరోనా సోకింది.

Dr Ashwath Naryan Deputy Chief Minister of Karnataka Tests Positive For COVID 19
కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్​

ఇప్పటికే పలువురు నాయకులు మహమ్మారి కరోనా బారిన పడగా... తాజాగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి అశ్వత్​ నారాయణ్​కు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకున్న క్రమంలో వైరస్​ సోకినట్లు తేలింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే ఎటువంటి లక్షణాలు లేవని వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగినవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ప్రతిపక్ష నేతకు వైరస్​

ఉత్తరాఖండ్​ ప్రతిపక్ష నేత ఇందిరా హృదయేశ్​ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రదేశ్​ కాంగ్రెస్​ ఉపాధ్యక్షుడు ధీరేంద్ర ప్రతాప్​ తెలిపారు. ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. దీంతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ప్రీతం సింగ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'శ్రామిక్​ రైళ్లల్లో 97మంది కూలీలు మృతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.