ETV Bharat / bharat

'యడ్డీ.. ఆందోళన వద్దు.. కరోనాపై పోరే ముందు!'

author img

By

Published : May 30, 2020, 3:27 PM IST

yeddi
'తిరుగుబాటుపై ఆందోళన వద్దు.. కరోనాపై పోరే ముందు'

కర్ణాటక భాజపాలో నెలకొన్న అసంతృప్త ఎమ్మెల్యేల అంశంపై ముఖ్యమంత్రి యడియూరప్పకు భాజపా అగ్రనేత, హోంమంత్రి అమిత్​షా అభయమిచ్చారని సమాచారం. రాష్ట్రంలో కరోనా నియంత్రణ వైపే సర్కార్​ దృష్టి కేంద్రీకరించాలని, ఎమ్మెల్యేల అసంతృప్తి అంశాన్ని తమకు వదిలేయాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో భాజపా అసంతృప్త ఎమ్మెల్యేల రహస్య సమావేశాలపై ఇప్పటికే పలు వార్తలు వినిపించాయి. ఇందులో సీఎం మార్పే లక్ష్యంగా చర్చించారని సమాచారం బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో అసమ్మతి ఎమ్మెల్యేల రహస్య సమావేశాల అంశమై ఆందోళన చెందాల్సిన పని లేదని.. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు అభయమిచ్చారు భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్​షా. రాష్ట్రంలో కరోనా నియంత్రణ వైపే దృష్టి సారించాలని, ఎమ్మెల్యేల అంశమై ఆందోళన అవసరం లేదని షా స్పష్టం చేసినట్లు సమాచారం.

'నేను చూసుకుంటాను'

శుక్రవారం రాత్రి యడియూరప్పతో ఫోన్​లో సంభాషించారు అమిత్​షా. అసంతృప్త ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు యడ్డీతో అమిత్​షా పేర్కొన్నారని సమాచారం. అసమ్మతి ఎమ్మెల్యేల డిమాండ్లు, వారి అసంతృప్తికి కారణాలపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఆపరేషన్​ హస్తం: కర్ణాటకలో ఏం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.