ETV Bharat / bharat

ఆ నిర్భయ దోషి మైనర్​ కాదు: దిల్లీ హైకోర్టు

author img

By

Published : Dec 19, 2019, 5:05 PM IST

నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్​ అంటూ దోషి పవన్​ కుమార్​ దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అతడి న్యాయవాదికి రూ.25వేలు జరిమానా విధించింది.

దిల్లీ హైకోర్టు
దిల్లీ హైకోర్టు

నిర్భయ కేసులో దోషి పవన్​ కుమార్ గుప్తా​ పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఘటన సమయం(డిసెంబర్​ 2012)లో తాను మైనర్​ అని, బాల నేరస్థుల​ చట్టం కింద తనను శిక్షించాలని అతడు కోర్టును కోరాడు.

వ్యాజ్యం కొట్టివేతతో పాటు గుప్తా తరఫు న్యాయవాది ఏపీ సింగ్​కు రూ.25వేలు జరిమానా విధించింది కోర్టు. న్యాయస్థానం ఆదేశించినా ఖాతరు చేయకుండా కోర్టుకు గైర్హాజరయ్యాని ఆగ్రహించింది. దోషి వయసుకు సంబంధించి తప్పుడు ప్రమాణ పత్రం సమర్పించినందుకు సింగ్​పై చర్యలు తీసుకోవాలని బార్​ కౌన్సిల్​ను ఆదేశించింది.

నిర్భయ తల్లి హర్షం

హైకోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశా దేవి సంతోషం వ్యక్తం చేశారు.

"ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఇలాంటి వారికి గుణపాఠం నేర్పడం ఎంతో అవసరం. చాలా సంతోషంగా ఉంది. "

-ఆశా దేవి, నిర్భయ తల్లి

ఇదీ జరిగింది..

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్​ 29న తీవ్ర గాయాలతో ఆమె మరణించింది. వీరిలో ఒకడు మైనర్​ కాగా.... మరొకడు తిహార్​ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన దోషులైన ముకేశ్​, పవన్​ గుప్తా, అక్షయ్​, వినయ్​ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది.

ఇదీ చూడండి: అవగాహన లేక 'పౌర' చట్టంపై విపక్షాల నిరసనలు

Lucknow, Dec 19 (ANI): Samajwadi Party (SP) MLAs in Uttar Pradesh held a protest against the new Citizenship law outside the state assembly in Lucknow. They flagged placards against the government and the new Citizenship law. The party members also raised questions on inflation and farmers issue.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.