ETV Bharat / bharat

'రెండు వారాల్లోనే మార్కెట్లోకి కరోనా మందు'

author img

By

Published : Jun 20, 2020, 7:45 AM IST

Baba Ramdev
'రెండు వారాల్లో మార్కెట్లోకి కొవిడ్​-19 మందు'

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్​ మెడిసిన్​పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ యోగా గురువు బాబా రాం​దేవ్​. రెండు వారాల్లో కొవిడ్​-19కు మందును.. పతాంజలి మార్కెట్లోకి తీసుకొస్తుందని తెలిపారు. కరోనా వైరస్ సహా అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి పలు విషయాలపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు బాబా.

కొవిడ్​-19ను అంతంచేసే మందు రెండు వారాల్లోనే మార్కెట్లోకి రానుందని పేర్కొన్నారు ప్రముఖ యోగా గురువు బాబా రాం​దేవ్​. కరోనా మహమ్మారిపై పోరాటంలో తమ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలు రోజూ తప్పనిసరిగా యోగా చేయాలని సూచించారు. చైనా ఉత్పత్తులను నిషేధించాలని పిలుపునిస్తూ.. ఈటీవీ భారత్​ ముఖాముఖిలో కీలక విషయాలు వెల్లడించారు రాం​దేవ్​. అలాగే.. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధిక పన్నులు విధించాలని సూచించారు.

యోగా గురువు రామ్​దేవ్​ బాబా

ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోందని.. దేశంలో ఇప్పటికే 12వేలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు బాబా. ఈ క్రమంలో కొవిడ్​-19కు మందు తయారు చేసే పనిలో పతాంజలిలోని పరిశోధన, అభివృద్ధి విభాగం పురోగతి సాధించినట్లు తెలిపారు. రెండు వారాల్లో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. 'కరోనా రికవరీ రేటు అధికంగా ఉంది.. వైరస్​ చికిత్సకు అలోపతి మందులతో పాటు ఆయుర్వేద మందులను సూచించాలని' ఐసీఎంఆర్​ను కోరారు బాబా. కరోనా ఔషధం తయారీలో అన్ని రకాల నిబంధనలను పాటించామని, 100 శాతం రికవరీ రేటు ఉంటుందని తెలిపారు.

యోగా గురువు రామ్​దేవ్​ బాబా
యోగా గురువు రామ్​దేవ్​ బాబా

ఇదీ చూడండి: 'భారతదేశ సౌర్వభౌమత్వాన్ని చైనా గౌరవించాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.