ETV Bharat / bharat

దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Nov 15, 2020, 10:39 AM IST

భారత్​లో తాజాగా 41,100 కరోనా కేసులు నమోదయయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 88 లక్షల 14 వేలు దాటింది. మహమ్మారి ధాటికి మరో 447 మంది మరణించారు.

coronavirus cases updates in India
దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. కొత్తగా 41,100 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 447 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసులు: 88,14,579

మొత్తం మరణాలు: 1,29,635

మొత్తం కోలుకున్నవారు: 82,05,728

దేశంలో తాజాగా 42,156 మంది వైరస్​ను​ జయించారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 5 లక్షల దిగువనే కొనసాగుతోంది.

నవంబరు 14 వరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల 48 లక్షల 36 వేలకుపైగా కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ఇదీ చూడండి: ఇద్దరు యువతులపై ఆరుగురి అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.