ETV Bharat / bharat

'దావూద్​కు ఆ రోజే స్కెచ్​ వేశారు... కాస్తలో మిస్​'

author img

By

Published : Feb 24, 2020, 5:12 PM IST

Updated : Mar 2, 2020, 10:16 AM IST

dawood
దావూద్

దావూద్ అనుచరుడిగా పనిచేసి తర్వాత వేరు కుంపటి పెట్టుకున్న గ్యాంగ్​స్టర్ ఎజాజ్ లక్డావాలా ఇటీవల పోలీసులకు చిక్కాడు. విచారణలో అతడు పలు విస్తుపోయే విషయాలను వెల్లడించాడు. అయన ఏం చెప్పాడు? చోటా రాజన్​, దావుద్ ఇబ్రహీం మధ్య ఏం జరిగింది? ఒక తాయత్తు తన ప్రాణాలను ఎలా కాపాడింది?

20 ఏళ్లుగా పరారీలో ఉన్న గ్యాంగ్​స్టర్ ఎజాజ్ లక్డావాలా గత నెల ముంబయి పోలీసులకు చిక్కాడు. లక్డావాలాను విచారించగా కొన్ని కీలక నిజాలు బయటపెట్టాడు. 1998లో అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీంను చంపేందుకు ప్రయత్నించింది చోటా రాజన్ గ్యాంగేనని , అందులో తానూ భాగస్వాముడినేనని ఒప్పుకున్నాడు లక్డావాలా.

దర్గా వద్ద మకాం..

కరడుగట్టిన గ్యాంగ్​స్టర్​ దావూద్​ ఇబ్రహీంకు అనుచరుడిగా పనిచేశాడు లక్డావాలా. అయితే కొన్నేళ్ల తరువాత వ్యక్తిగత విబేధాలతో దావూద్​ శత్రువైన చోటా రాజన్​ గ్యాంగ్​లో చేరాడు. 1998లో చోటా రాజన్ సన్నిహితులు విక్కీ మల్హోత్రా, ఫరీద్​ తనాషా, బాలు డోక్రే, వినోద్​ మాత్కర్​, సంజయ్​ ఘాటే, బాబారెడ్డి దావూద్​ హత్యకు పథకం వేశారు. ఈ ముఠాలో లక్డావాలా కూడా ఉన్నాడు.

తన కూతురు మృతి చెందినప్పుడు ప్రార్థనలు చేసేందుకు పాకిస్థాన్​ కరాచీలోని ఓ దర్గాకు దావూద్​ రాబోతున్నాడని తెలుసుకున్న విక్కీ ముఠా.. ఎలాగైనా దావూద్​ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో పథకం విఫలమైందని చెప్పాడు లక్డావాలా.

"విక్కీ మల్హోత్రా బృందం దావూద్​ను చంపేందుకు వారు కోసం దర్గా దగ్గర మకాం వేశారు. ఆ రోజు ఓ నేపాల్​ పార్లమెంట్​ సభ్యుడు వారి పథకంపై సమాచారం ఇవ్వడం వల్ల భారీ భద్రతతో దర్గాకు వచ్చాడు దావూద్​. దీంతో వారు ఆ రోజు వేసిన పథకం విఫలమైంది. అప్పుడు దావూద్​కు ఈ విషయం తెలిసిపోయి ఉంటుందని చోటారాజన్​ తన అనుచరులను అక్కడి నుంచి పంపించేశాడు."

-పోలీస్​ అధికారి

"చోటారాజన్​ పథకం గురించి తెలుసుకున్న పాకిస్థాన్​ పోలీసులు విక్కీ మల్హోత్రా బృంద సభ్యుల ఇళ్లను సోదా చేశారు. దావూద్​ను హతమార్చేందుకు సమకూర్చిన ఆయుధాలను తీసుకెళ్లారు" అని చెప్పుకొచ్చాడు లక్డావాలా.

లక్డావాలాపై దాడి..

చోటా రాజన్​ బృందం దావూద్​ను చంపేందుకు విఫలయత్నం చేసిన తర్వాత.. దావూద్​ అనుచరుడు​ చోటా షకీల్​ బృందం లక్డావాలాపై దాడి చేసింది. బ్యాంకాక్​లో ఓ మార్కెట్​లో కాల్పులు జరిపారు. ఆ సమయంలో తాయత్తు తన జేబులో ఉండడం వల్ల బుల్లెట్లు శరీరంలోకి వెళ్లలేదని చెప్పుకొచ్చాడు లక్డావాలా.

ఈ క్రమంలో 2008లో చోటా రాజన్​ నుంచి విడిపోయి స్వతంత్రంగా గ్యాంగ్​ను ఏర్పాటు చేసుకున్నాడు లక్డావాలా. 2000 సంవత్సరంలో దావూద్​ సన్నిహితుడు మున్నా జింగాడా అలియాస్​ సయ్యద్​ ముద్దస్సార్​ హుస్సేన్​ చోటా రాజన్​పై దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో దావూద్​కు సాయం చేసిన నేపాల్​ పార్లమెంట్ సభ్యుడిని హతమార్చాడు మల్హోత్రా​.

బ్యాంకాక్​లో దాడి జరిగినప్పుడే అంతా లక్డావాలా చనిపోయాడనుకున్నారు. కానీ అతడు దావూద్​ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పాకిస్థాన్​కు వెళ్లాడు. గత కొన్నేళ్లుగా లక్డావాలా నకిలీ వీసాతో నేపాల్​లో ఉంటున్నాడు.

Last Updated :Mar 2, 2020, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.