ETV Bharat / bharat

'విరాళాల సేకరణలో భాజపాదే అగ్రస్థానం'

author img

By

Published : Jul 10, 2019, 5:18 AM IST

Updated : Jul 10, 2019, 7:31 AM IST

కార్పొరేట్​ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించిన జాతీయ పార్టీల్లో భాజపా ముందంజలో ఉందని ఏడీఆర్ (ది అసోసియేషన్​ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ ) విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. 2016-18 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆ పార్టీ సుమారు రూ.900 కోట్ల విరాళాలు సేకరించింది. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన జాతీయ పార్టీలు విరాళాల స్వీకరణలో చాలా వెనుకంజలో ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

విరాళాల సేకరణలో భాజపా తర్వాతే ఎవరైనా..!

కార్పొరేట్ల నుంచి భారీ విరాళాలు పొందిన జాతీయ పార్టీల్లో భాజపా అగ్రస్థానంలో నిలిచింది. 2016-18 సంవత్సరాల మధ్య ఆ పార్టీకి 1,731 కార్పొరేట్లు విరాళాలు ఇచ్చారు. ఈ విరాళాల విలువ సుమారు రూ.900 కోట్లు. అదే సమయంలో కాంగ్రెస్ సేకరించిన విరాళాల కంటే ఇది 16 రెట్లు అధికం అన్నమాట. ది అసోసియేషన్ ఫర్​ డెమొక్రాటిక్​ రిఫార్మ్స్​ (ఏడీఆర్​) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం, 2016-18 మధ్య కాలంలో వ్యాపార సంస్థలు మొత్తంగా రూ.985.18 కోట్ల విరాళాలు ఇచ్చాయి. ఈ విరాళాల్లో రాజకీయ పార్టీలకు ఇచ్చిన వాటా సుమారు 93 శాతం కావడం గమనార్హం.

భాజపాదే అగ్రస్థానం..

"ఆరు జాతీయ పార్టీల్లో.... 2016-18 సంవత్సరాలకు గాను.....భాజపా గరిష్ఠంగా రూ.915.569 కోట్ల విరాళాలు పొందింది. ఈ విరాళాలను 1731 మంది కార్పొరేట్ దాతలు అందించారు. భాజపా తరువాతి స్థానంలో నిలిచిన కాంగ్రెస్...151 మంది కార్పొరేట్ల నుంచి కేవలం రూ.55.36 కోట్ల విరాళాలు మాత్రమే సేకరించగలిగింది. ఎన్​సీపీ 23 కార్పొరేట్ల నుంచి రూ.7.37 కోట్ల విరాళాలు పొందింది." - ఏడీఆర్​ నివేదిక

2016-17 మరియు 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో కార్పొరేట్లు స్వచ్ఛందంగా అందించిన.... రూ.20 వేలు మించిన విరాళాలను భాజపా 94 శాతం, కాంగ్రెస్ 81 శాతం వరకు పొందాయి.

2012-13 నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరాల మధ్య కార్పొరేట్ల నుంచి భాజపా దాదాపు రూ.1621.40 కోట్లను విరాళాలుగా పొందింది. ఇది ఆ 6 సంవత్సరాల్లో కార్పొరేట్లు అందరూ ఇచ్చిన విరాళాల్లో 83.49 శాతం కావడం గమనార్హం.

పెరుగుతున్న కార్పొరేట్ విరాళాలు

ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం 2004-05 నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో... జాతీయపార్టీలకు కార్పొరేట్లు అందించే విరాళాలు 160 శాతం పెరిగాయి.

2012-13 నుంచి 2017-18 మధ్యకాలంలో తీసుకుంటే ఈ విరాళాలు 414% పెరిగాయి. ఒక్క 2015-16 సంవత్సరంలో మాత్రం కార్పొరేట్ విరాళాల్లో తగ్గుదల కనిపించింది.

జాతీయ పార్టీలు

ఏడీఆర్... ఆరు జాతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకొని తాజా నివేదిక రూపొందించింది. ఆ రాజకీయ పార్టీలు.. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్​సీపీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), సీపీఎమ్​, ఆల్​ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ).

మరో జాతీయ పార్టీ బీఎస్పీని.... ఏడీఆర్​ పరిగణించలేదు. ఎందుకంటే 2004 నుంచి రూ.20 వేలు మించిన స్వచ్ఛంద విరాళాలు తమకు రాలేదని ఆ పార్టీ ప్రకటించింది.

ఏడీఆర్ నివేదిక ప్రకారం అత్యంత తక్కువ కార్పొరేట్ విరాళాలు (2 శాతం) పొందుతున్న జాతీయపార్టీ సీపీఐ.

ఇదీ చూడండి: భారత్​పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ గుస్సా


Bengaluru, July 09(ANI): Amid political tussle in Karnataka, state Congress leader Zameer Ahmad on Tuesday alleged that Bharatiya Janata Party (BJP) has kidnapped his party's MLAs and is keeping them at gunpoint. "Their mobile phones have been seized. They're not even allowed to talk to their family members. If set free, the MLAs will return to us. 4-5 people each are keeping a watch on them," added Ahmad.
Last Updated :Jul 10, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.