ETV Bharat / bharat

మరోసారి బిగ్​బీ ఉదారత.. ఏం చేశారంటే?

author img

By

Published : Jun 11, 2020, 12:32 PM IST

బాలీవుడ్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​ మరోసారి తన దయాగుణాన్ని చాటారు. లాక్​డౌన్​ కారణంగా ముంబయిలో చిక్కుకున్న వలస కార్మికులకు.. ఓ ప్రత్యేక విమానం ఏర్పాటుచేసి వారిని సొంత రాష్ట్రాలకు చేర్చారు.

amithabh bachchan send 187 labourers by flight
వలస కార్మికులను ఆదుకొన్న బిగ్​బీ

లాక్​డౌన్​ కారణంగా ముంబయిలో చిక్కుకుపోయిన వలస కూలీలను ప్రత్యేక విమానంలో వారి సొంత రాష్ట్రానికి తరలించి.. మరోసారి ఉదారతను చాటుకున్నారు బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​. ఈ ఉదయం ముంబయి నుంచి సుమారు 180 మంది వలస కూలీలతో బయల్దేరిన ప్రత్యేక విమానం లఖ్​నవూ విమానాశ్రయానికి చేరుకున్నట్లు ఎయిర్​పోర్ట్​ అధికారి ఒకరు తెలిపారు. వీరంతా ఉత్తర్​ప్రదేశ్​లోని ఉన్నావ్, గోండా, లఖ్​నవూకు చెందినవారని చెప్పారు.

మహారాష్ట్రలో చిక్కుకుపోయిన దాదాపు 700 మంది వలస కూలీలను ఉత్తర్​ప్రదేశ్​లోని పలు ప్రాంతాలకు తరలించేందుకు అమితాబ్​ మూడు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. ఇవి ముంబయి నుంచి అలహాబాద్, గోరఖ్​పుర్​, వారణాసికి కూలీలను తరలించనున్నాయి. వలస కార్మికుల తరలింపు ప్రక్రియను అమితాబ్​ సన్నిహితుడు రాజీవ్ యాదవ్​ పర్యవేక్షిస్తున్నారు. సొంతఊళ్లకు చేరుకున్న వలసకూలీలు.. బిగ్​బీకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: అత్త మీద కోపంతో కన్నబిడ్డను పొడిచి చంపిన తల్లి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.