ETV Bharat / bharat

ఝార్ఖండ్​ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

author img

By

Published : Nov 2, 2020, 9:45 AM IST

Updated : Nov 2, 2020, 9:58 AM IST

ఝార్ఖండ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఆగి ఉన్న ట్రక్కును వేగనార్​ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

dhanbad_accident
ధన్​బాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

ఝూర్ఖండ్​ ధన్​బాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గోవింద్​ పూర్-సాహిబ్​గంజ్ రహదారి పక్కన ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన వేగనార్​ కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్​ను ధన్​బాద్​ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. బాధితులు ధన్​బాద్​ నుంచి జాంతార్​ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

dhanbad_accident
ప్రమాదంలో 5 మంది మృతి
dhanbad_accident
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

మరో ఘటనలో..

గుజరాత్​లోని వల్సాడ్ ప్రాంతంలో బస్సు బోల్తా పడి 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సూరత్​ నుంచి బెంగుళూరు వెళ్తుండగా 48వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో గాయపడ్డ 20 మందిని వల్సాడ్​ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'బాబా కా దాబా' విరాళాల పేరుతో మోసం!

Last Updated :Nov 2, 2020, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.