అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హమీ మేరకు 100 వెంటిలెేటర్లను భారత్కు పంపుతున్నారని అధికారులు తెలిపారు. సోమవారం రోజు అవి దేశానికి చేరుకుంటాయని చెప్పారు. ఎయిర్ ఇండియా విమానం వీటిని తరలిస్తోందన్నారు. వీటి నిర్వహణ బాధ్యత రెడ్ క్రాస్ సొసైటీ చూసుకుంటుందని పేర్కొన్నారు.
కరోనాపై పోరులో వెంటిలేటర్ల పాత్రే అత్యంత కీలకం. ఆరోగ్యం విషమించిన రోగులకు ప్రాణాధారంగా ఉంటాయి. అమెరికా పంపుతున్న 100 ఉన్నత సాంకేతికత వెంటిలేటర్లను ఆ దేశానికి చెందిన జోల్ సంస్థ తయారు చేసింది.
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు భారత్కు విరాళంగా అమెరికా 100 వెంటిలేటర్లు అందిస్తుందని మే 16న ట్వీట్ చేశారు ట్రంప్. స్పందనగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.